పరకాల, ఫిబ్రవరి 25 : జై తెలంగాణ అని నినదించడమే దేశ ద్రోహంగా భావించిన పోలీసులు ఆదివారం తెల్లవారు జామున 3-4 గంటల ప్రాంతం లో కొందరు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు.
దామెర, ఆత్మకూరు మండలాల వైస్ ఎంపీపీలు ఎండీ జాకీర్అలీ, రేవూరి సుధాకర్రెడ్డి, ఆత్మకూరు మం డలం అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూస కుమారస్వామి, రేగుల కిశోర్, పెద్దాపూర్ గ్రామానికి చెందిన వేల్పుల గణేశ్, అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన ఆవుల శ్రీనివాస్, వంచ సాంబశివారెడ్డి, గుడెప్పాడ్ గ్రామానికి చెందిన కాంతాల కేశవరెడ్డి, కాంతాల రవీందర్రెడ్డి, దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కమలాకర్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.