తొర్రూరు, అక్టోబర్ 21 : ‘తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం. మళ్ల అధికారం కేసీఆర్ దే.. 40 ఏళ్ల నా రాజకీయ అనుభవంతో చెబుతున్న.. ఎవరు ఏ సర్వేలు చెప్పినా నమ్మొ ద్దు.. గతానికి మించి పాలకుర్తిలో మెజార్టీ వస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. హైదరాబాద్లో స్థిరపడిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన డ్రైవింగ్ సూల్ వాహనదారులు శనివారం సుమారు 200 కార్లతో తలపెట్టిన ర్యాలీని పాలకుర్తిలో ప్రారంభించి తొర్రూరు లో ముగించారు. అనంతరం తొర్రూరులోని ఎల్వైఆర్ గార్డెన్ ఆవరణలో నిర్వహించిన ఆత్మీయసభలో మంత్రి మాట్లాడుతూ.. ఫేక్ సర్వేలతో కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, 80 సీట్లకు తగ్గకుండా గెలుస్తామన్నారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతున్నారని అన్నారు. ఇంత ప్రజారంజక పాలన గతంలో ఎన్నడూ లేదన్నారు.
అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కరెంటు కోతలు, ఆకలి చావులు, రైతుల కష్టాలు, ప్రజల ఇబ్బందులు మళ్లీ చూడాల్సి వస్తుందన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరని, ప్రజ లు తిరసరించిన, బీఆర్ఎస్ పార్టీ వదిలేసిన వాళ్లకు కాంగ్రెస్ వాళ్లు టికెట్లు ఇస్తున్నారని అన్నారు. అలాంటి వాళ్లను ప్రజలు పట్టించుకోరని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, గతంలో వచ్చిన 50వేల మెజారిటీని ఈ సారి అధిగమిస్తామన్నారు. రాజకీయంగానే కాకుండా.., ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డ్రైవింగ్ స్కూల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి కరుణాకర్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రత్నాకర్, బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు మంగళపల్లి రామచంద్రయ్య, మంగళపల్లి శ్రీనివాస్, కాకిరాల హరిప్రసాద్, ఎల్ వెంకటనారాయణగౌడ్, డాక్టర్ పీ సోమేశ్వర్రావు, రామసహాయం కిశోర్రెడ్డి, పసుమర్తి సీతారాములు, కర్నె సోమయ్య, జినుగ సురేందర్రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు వెంకన్న, సుధాకర్, రాజు, సోమేశ్, ముణీందర్, అనిల్, అశోక్, రామ్మూర్తి, కిరణ్, యాదగిరి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గెలుపు కోసం ఊరూవాడ ఏకమవుతున్నది. ప్రధానంగా యువతరం ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలోని పలు వార్డులతోపాటు చెర్లపాలెం, గోపాలగిరి, గుర్తూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు నుంచి బీఆర్ఎస్లో చేరగా, మంత్రి ఎర్రబెల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొర్రూరు 2వ వార్డు విద్యానగర్కు చెందిన యువకులు కౌన్సిలర్ రోజా, బీఆర్ఎస్ యువజన నాయకులు చకిలేల మణిరాజ్, తూనం శ్రావణ్ ఆధ్వర్యంలో రాజు, ఉదయ్తేజ, వెంకటరమణాచారి, గణేశ్, తరుణ్, వీబీ శర్మ, రవితేజ, రాజశేఖర్, యశ్వంత్, అఖిల్తోపాటు 80 మంది బీఆర్ఎస్లో చేరారు. చెర్లపాలానికి చెందిన ఒకటో వార్డు సభ్యుడు కర్ర మౌనిక, ప్రశాంత్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి తమ అనుచరులతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. గుర్తూరుకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు కక్కెర్ల శ్రీకాంత్, ఫరూక్అలీ, ఉమేశ్, సాగర్, వినోద్, బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు సతీశ్, గోపాలగిరి మాజీ ఉపసర్పంచ్ ధర్మారపు ఉప్పలయ్య, నర్సయ్య, అనిల్, మధుతోపాటు అనేక మంది మంత్రి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.