బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తున్నది. ప్రచారంలో భాగంగా గడపగడపకూ ఓట్ల కోసం వెళ్లిన సందర్భంలో సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతూ నిండుమనస్సుతో ఆశీర్వదిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం గులాబీ క్యాంపెయిన్ ఊపందుకోగా అన్నిచోట్లా ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ‘మ్యానిఫెస్టో’ కరపత్రాలతో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ దశ మార్చే ‘కారు’ గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆడబిడ్డల బతుకమ్మ ఆటలు, కళాకారుల పాటలు, నృత్యాల నడుమ గులాబీ శ్రేణుల భారీ ర్యాలీలతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తింది.
పాలకుర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారం చేశారు. నగరంలోని 29వ డివిజన్లో వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ ఓట్లు అభ్యర్థించారు. రఘునాథపల్లి మండలంలో స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి ప్రచారం చేశారు. 3వ డివిజన్లో వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ భారీ ర్యాలీ నడుమ ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. 38వ డివిజన్లో తూర్పు అభ్యర్థి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
భూపాలపల్లిలో అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. మంగపేట మండలంలో ఆర్అండ్బీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావుతో కలిసి ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రచారం చేశారు. నెల్లికుదురు మండలంలో మానుకోట అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ ప్రచారం చేశారు. గీసుగొండ, సంగెం మండలాల్లో పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచారం చేశారు. గార్ల మండలంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ ప్రచారం చేశారు.