కాశీబుగ్గ, నవంబర్ 23: తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. తనకు మార్కెట్ పరిధిలోని అన్ని వర్గాల ప్రజల నుంచి ఆశీర్వాదం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్, హమాలీలు, దడువాయిలు, గుమస్తాలు, కార్మికులు, పత్తి, మిర్చి వ్యాపారులు, చాటకూలి మహిళలు, ఇతర కార్మికులతో సమావేశమై కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకే తూర్పు నియోజకవర్గాన్ని రూ. 4100 కోట్లతో గొప్పగా అభివృద్ధి చేశానన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తనకు ప్రజా సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. వరంగల్లో ఇన్నర్ రింగ్రోడ్డు తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో రింగ్రోడ్డు చుట్టూ కంపెనీలు నెలకొల్పేలా తాము ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. చాంబర్కు స్థలాన్ని కేటాయించామని, త్వరలోనే పక్కా భవనం నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పారు. అన్ని వర్గాల వారు తనకు సంపూర్ణ మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అనంతరం మార్కెట్ మొత్తం కలియతిరిగి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చాంబర్ మాజీ అధ్యక్షుడు, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, అడ్తి, ఖరీదు వ్యాపారులు తోట నర్సింగరావు, గజ్జెల రామకృష్ణ, పోతు కుమారస్వామి, కొత్త కిశోర్కుమార్, నల్ల సాంబయ్య, మొగిలి చంద్రమౌళి, మిరిపెల్లి రాజ్కుమార్, ఇనుముల మల్లేశం పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ కోరారు. బుధవారం రాత్రి 24వ డివిజన్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ ఆకుతోట తేజస్వినీ శిరీష్ ఆధ్వర్యంలో గడప గడపకూ వెళ్లి సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకుతూ నన్నపునేనికి వీరతిలకం దిద్దారు. ఎంపీ పసునూరి దయాకర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్తో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. తూర్పులో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. పాపయ్యపేట బొడ్రాయిని దగ్గర ఉండి నిలబెట్టే జిమ్మేదారి తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు పందికొండ శివరాజ్, నాయకుడు తోట హరీష్, ఎన్నికల ఇన్చార్జి దాచెపల్లి సీతారాం, నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు పాల్గొన్నారు.