హనుమకొండ చౌరస్తా/వర్ధన్నపేట, మార్చి 12 : మరో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు విగతజీవిగా మారాడు. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి గల్లంతైన ఆ యువకుడు ఎస్సారెస్పీ కాల్వలో మంగళవా రం శవమై తేలాడు. వివరాలిలా ఉన్నా యి. హనుమకొండలోని గోకుల్నగర్కు చెందిన భూక్య కృష్ణతేజ్(29)కు నర్సంపేటకు చెందిన యువతితో ఈ నెల 16న వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో సోమవారం పెళ్లి పత్రికలు పంచేందుకు ఇంటి నుంచి వెళ్లి కృష్ణతేజ్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.
పలివేల్పులలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అతడి బైక్ దొరికింది. కాల్వలో కృష్ణతేజ పడిపోయి ఉం టాడనే అనుమానంతో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు గాలించారు. మం గళవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం ఉన్నట్లు రైతులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అది కృష్ణతేజ మృతదేహంగా గుర్తించారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపి కెనాల్లో పడేసి ఉంటారా? లేక ప్రేమ వ్య వహా రం ఏదైనా ఉందా అనే కోణంలో వి చారణ జరుపుతున్నారు. కృష్ణతేజ మృతి తో గోకుల్నగర్లో విషాదం నెలకొంది.