వరంగల్ : పేదలకు వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి మారిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ శివనగర్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసారు.
కొత్తవాడకి చెందిన భాస్కర్ రూ. 1.50 లక్షలు, ఎల్బీనగర్ కు చెందిన జాఫర్ హుస్సేన్ రూ 2,00,000, ఎల్లంబజార్ కు చెందిన సరస్వతి రూ 2,50,000, ఉమ రూ. 2,00,000 చెక్కులతో పాటు మొత్తంగా నియోజకవర్గంలో 49 మంది లబ్ధిదారులకు 28,42,000/- రూపాయల విలువ చేసే చెక్కులను అందజేసారు.ఈ సందర్బంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.