బండి సంజయ్ ఓ మూర్ఖుడు.. ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభలో చెప్పినవన్నీ అబద్ధాలేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. హనుమకొండలో బీజేపీ నిర్వహించిన సభ జనంలేక అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. జేపీ నడ్డా, కిషన్రెడ్డి, బండి సంజయ్ ప్రసంగాల్లో పసలేదని, చెప్పిందే చెప్పడంతో వినలేక జనం విసుగెత్తిపోయారని అన్నారు.
హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ మూర్ఖుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, బస్వరాజు సారయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ప్రజాసంగ్రామ ముగింపు సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. ప్రజాదరణ లేని సభ అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు నడ్డా, కిషన్రెడ్డి, బండి సంజయ్ ప్రసంగాల్లో పసలేదని అన్నారు. 15 రోజుల పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్నదేమిటి.?, మీరు సభలో మాట్లాడిందేమిటని ప్రశ్నించారు. విభజన హామీలైన ఉకు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీపై ఏం చెబుతారో అని చూశాం.. కానీ, వాటిని ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
ప్రశ్నించిన ప్రజలపై దాడులు చేశారన్నారు. గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయించి 5 సంవత్సరాలైనా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదన్నారు. కోచ్ఫ్యాక్టరీని తెలంగాణ ఇవ్వకుండా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు మంజూరు చేశారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్న స్కీంలు, తెలంగాణలో అమవుతున్న స్కీంలపై ఒకసారి విశ్లేషించుకుందామన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి, బండి సంజయ్కి సవాల్ చేస్తున్నా.. మీరు పాలిస్తున్న రాష్ర్టాలకు వెళ్దాం.. ఇకడ అమలవుతున్న సీంలు అకడ ఇస్తే నేను క్షమాపణలు చెప్తా.. లేకుంటే మీరు తప్పయిందని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. గత ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణకు మీరు చేసిందేమీ లేదన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో రాష్ట్రం రూ. 3,68,798 కోట్లు చెల్లిస్తే, తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.2లక్షల కోట్లేనన్నారు. ఇంకా 1.68కోట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి పేర్కొన్నా రు. మాకు న్యాయపరంగా ఇచ్చే వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నీ విలువను తగ్గించుకోవద్దని సూచించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ, మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిస్తే ఇంత వరకు వాటి ఊసే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో అమలవుతున్న అనేక సీంలకు అవార్డులు ఇచ్చుకుంటూనే విమర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేసాలను రెచ్చగొట్టి అధికారంలోని రావాలని చూస్తున్న బీజేపీ పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ అబద్ధపు, మత విద్వేశాలను రెచ్చగొట్టే మాటలను మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని మంత్రి దయాకర్రావు హితవు పలికారు.
మన్ననలేని పార్టీ బీజేపీ : కడియం
ప్రజల ఆదరణ లేకపోవడంతోనే ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సభ ప్లాప్ అయిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. లక్షల మందితో సభ నిర్వహిస్తామన్న బీజేపీ నాయకులు జన సమీకరణ చేయలేక చతికిలపడ్డారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి అనేక నిధుల ఇచ్చామని అబద్ధాలు మాట్లాడుతున్నారని, నీవు తెలంగాణ బిడ్డవైతే, నీలో ప్రవహిస్తున్నది తెలంగాణ రక్తమైతే యూపీకి ఇచ్చిన నేషనల్ హైవే రోడ్లకు ఎన్ని నిధులిచ్చారు.., తెలంగాణకు ఎన్ని ఇచ్చారో ఒకసారి లెకలు తెలుసుకో అని హితవు పలికారు. యూపీకి ఇచ్చిన నిధుల్లో కనీసం 25శాతమైనా తెలంగాణకు ఇచ్చారా అని ప్రశ్నించారు. పేపర్ పట్టుకొని లెక్కలు ఎవరైనా చెబుతారని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ ఇప్పటికీ మొదలు కాకపోవడం నీ చేతకానితనం కాదా ప్రశించారు. అది చేసినం.. ఇది చేసిన అంటూ ఉపన్యాసం ఇస్తున్నావు.. ఇది నీ అయ్యజాగీరా అని మండిపడ్డారు. బీజేపీ దగుల్బాజీ పార్టీ, ప్రజాస్వామ్యానికి కళంకం తెస్తుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తుందని, కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలా ? మీరే పాలించాలని అనుకోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ, మోదీకి ఎవరూ సహకరించకపోయినా వారిపై ఈడీ కేసులు, సీబీఐ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టిన కేసులు ఎన్ని… బీజేపీ నాయకులపై ఎన్ని పెట్టారు… ఇతర పార్టీల వారిపై పెట్టిన కేసులు ఎన్నో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వేల కోట్లరూపాయలు ఎగ్గొట్టిన వారిని ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తున్న ఉచితాలను ఎత్తేయాలనడం సరికాదన్నారు. దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు సీఎం కేసీఆర్కు వస్తున్న పేరు ప్రతిష్ఠలను బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తూ, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, మెట్టు శ్రీనివాస్, సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెచ్చగొడుతున్న బీజేపీ: అరూరి
బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జాతీయ, రాష్ట్ర నేతలు తెలంగాణకు ఇప్పటి వరకు ఏమి చేశారో, ఇక ముందు ఏం చేస్తారో చెప్పకుండా సభను ముగించారన్నారు. రౌడీలు, బౌన్సర్లను వెంటేసుకుని వేరే జిల్లాల నుంచి వచ్చిన వారితో యాత్ర చేపట్టారు. సభకు ఉమ్మడి జిల్లా నుంచి ఎంత మంది వచ్చారు. ఇతర జిల్లాల నుంచి ఎంతమంది వచ్చారో ప్రజలు గమనించారన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూడడం మంచి పద్దతికాదన్నారు.