గిర్మాజీపేట, జనవరి 11 : స్టేషన్రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్లో బుధవారం ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ నిర్వహణలో సద్గురు త్యాగరాజస్వామి 176వ ఆరాధన మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ గందె కల్పన అధ్యక్షతన నిర్వహిస్తున్న వేడుకలను భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు శేషయ్య, ఆచార్యులు తిరుపతయ్య, హరి సనత్కుమార్, డాక్టర్ పాండురంగారావు, పీవీ శేషయ్యశాస్త్రి సమక్షంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు రామన్నపేటలోని రామలింగేశ్వర దేవాలయం నుంచి రాధాకృష్ణ గార్డెన్ వరకు బోనాలు, కోలాటాలు, సన్నాయి, డోలు వాయిద్యాల నడుమ త్యాగరాజస్వామి రథయాత్ర అత్యంత శోభాయమానంగా జరిగింది. తాగ్యరాజ కృతులతో వరంగల్చౌరస్తా మార్మోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళలు, కళాకారులను ప్రోత్సహించాలని, మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు పురాణ పురుషులు, కవులు, కళాకారులు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
త్యాగరాజస్వామి శ్రీరాముడిని నిత్యం కొలిచేవాడని, అనేక కృతుల్ని రచించి గానం చేశాడని చెప్పారు. ఉర్సు మైదానంలోని ఎకరం స్థలంలో కళా భవానాన్ని త్వరలోనే నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ఇప్పటినుంచి కళలకు సంబంధించిన కార్యక్రమాలను తూర్పు నియోజకవర్గంలోనే నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంగీత నృత్యకళాశాల ప్రిన్సిపాల్ ఎన్ సుధీర్కుమార్, కార్యక్రమ నిర్వహణ బాధ్యులు దిడ్డి కుమారస్వామి, రమేశ్బాబు, చింతాకుల సునీల్, దుబ్బ శ్రీనివాస్, నాగపురి సంజయ్బాబు, కేడల జనార్దన్, మనోహర్, మేడిది మధు, జోగు చంద్రశేఖర్, తోట నవీన్, గుండేటి నరేందర్, బోరిగం నర్సింగం, మీరిపెల్లి వినయ్కుమార్, గోపన్న, సతీశ్, రాజు, మధు, దేవాలయ కమిటీ చైర్మన్లు, కార్పొరేటర్లు మరుపల్ల రవి, దామోదర్యాదవ్, బాల్నె సురేశ్, పల్లం రవి, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్ పాల్గొన్నారు.
షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
పేదింటి ఆడబిడ్డలకు షాదీ ముబారక్ పథకం వరమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు రూ. 35,04,060 విలువైన షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్జోషి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..
కరీమాబాద్ : ప్రభుత్వ సహకారంతో 37వ డివిజన్లో త్వరలోనే రూ.4 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టబోతున్నామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 37వ డివిజన్ సమస్యలు, పార్టీ నిర్మాణంపై కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, బోగి సురేశ్ పాల్గొన్నారు.
బీజేపీ నుంచి చేరికలు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఖిలావరంగల్ తూర్పుకోట కొత్తగడ్డ రజకవాడకు చెందిన బీజేపీ నాయకులు రుగంటి విజయ్, చార్తి శ్రీకాంత్, చాపర్తి మల్లేశం, గట్టికొప్పుల భరత్, గట్టికొప్పుల మహేశ్ బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, బుడిగ జంగాల కాలనీ, పడమరకోట ఎస్సీకాలనీకి చెందిన శ్రీనివాస్, రవి, రాజేశ్, సంపత్, రేవంత్, కమలమ్మ పార్టీలో చేరారు. కార్పొరేటర్ కావటి కవిత పాల్గొన్నారు.