వేలేరు, జూలై 11 : మండల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నారని ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మల్లికుదుర్ల గ్రామంలోని గట్టు మల్లికార్జున స్వామి ఆలయంలో జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, ఎంపీపీ సమ్మిరెడ్డి, మండల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం బైక్ ర్యాలీతో మల్లికుదుర్ల నుంచి ఎమ్మెల్సీ పల్లా స్వగ్రామం సోడాషపల్లికి చేరుకున్నారు. సోడాషపల్లిలోని మహిళా భవనంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆ ధ్వర్యంలో, అంబేద్కర్ కమిటీ నిర్వహణలో జీవధార వలంటరీ బ్లడ్ సెంటర్ వారు చేపట్టిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. సూమారు 50 మందికిపైగా పాల్గొని రక్తదానం చేయగా, వారికి పండ్లు, జ్యూస్ అందజేశారు. అనంతరం పల్లా పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కేక్కట్ చేశారు. ఆనంతరం వేలేరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కేక్ కట్చేసి, పండ్ల్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలేరు మండల అభివృద్ధికి పల్లా రాజేశ్వర్రెడ్డి నిత్యం కృషి చేస్తున్నారన్నారు. మండల కేంద్రంలోని రుద్రా రామేశ్వర ఆలయంలో మండల కో ఆర్డినేటర్, మాజీ కుడా డైరెక్టర్ బిల్లా యాదగిరి ప్రత్యేక పూజలు చేసి, 101 కొబ్బరికాయలు సమర్పించారు. వేలేరు ఎంపీటీసీ ఈ సంధ్య భూపతిరాజు ఎమ్మెల్సీ పల్లా పేరుతో సూమారు సూమారు 500 మందికి టీషర్ట్స్లను పంపిణీ చేశారు. ఆనంతరం వేలేరు రైతువేదిక వద్ద సూమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీ అంగోత్ సంపత్, స ర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కే మాధవరెడ్డి, మాజీ జడ్పీటీసీ కీర్తీ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీలు జ్యోతి, మల్లన్న గుట్ట ఆలయ ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ రవి యాద వ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ధర్మసాగర్లో..
ధర్మసాగర్: ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు మండలంలో మంగళవారం పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం దాకా డప్పుచప్పుళ్ల మధ్య ర్యాలీ తీశారు. అనంతరం సుశ్మితాగార్డెన్లో కేక్కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. మహా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మల్లక్పల్లె సర్పంచ్ రాజుముదిరాజ్, సర్పంచ్ ఫోరం మండలాధ్యక్షుడు, నారాయణగిరి సర్పంచ్ కే సోమిరెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్, సర్పంచ్ ఎం శోభ, మాజీ సర్పంచ్ రజిత, జిల్లా కోఆప్షన్ సభ్యురాలు జుబేద లాల్ మహ్మాద్, బీఆర్ఎస్ నా యకులు దేవేందర్, బీ ప్రభుదాస్, రమేశ్, మాజీ ఎంపీపీ రఘు, సోమయ్య మండల మహిళా అధ్యక్షురాలు రాజమణి, టీ లక్ష్మి, బాలు, చిర్ర రవీందర్, లాల్ మహ్మద్, రాజిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా..
హనుమకొండ చౌరస్తా : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్టి పుట్టినరోజు వేడుకలు 5వ డివిజన్ హనుమాన్నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి కేకు కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొట్ల మనోహర్, సాధుల రఘుపతి, కుమార్రెడ్డి, ఉదయ్కిరణ్, రాజ్కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.