హనుమకొండ, మార్చి 24 : నగరంలోని జూపార్కులో త్వరలో పెద్దపులి సంద డి చేయనుంది. ఈ మేరకు హంటర్రోడ్డులోని కాకతీయ జూపార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం రూ. 60లక్షల వ్యయంతో ప్రత్యేకమైన ఎన్క్లోజర్ సిద్ధం చేస్తున్నారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, చదును చేయనున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న షెడ్డు కు మరమ్మతులు చేసి నైట్ షెడ్గా మారుస్తున్నారు. పెద్దపులి స్వేచ్ఛగా తిరగడంతో పాటు నివాసయోగ్యంగా ఉండేందుకు అవసరమై న సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ పని పూర్తయ్యేందుకు మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉందని జూపార్కు ఇన్చార్జి మయూరి తెలిపారు.