స్టేషన్ ఘన్పూర్/పాలకుర్తి రూరల్, మార్చి 16 : ఎన్నికల షెడ్యూల్కు ఒక రోజు ముందు బీఆర్ఎస్ను మానసికంగా దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కవిత అరెస్ట్కు నిరసనగా శనివారం స్టేషన్ఘన్పూర్లోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులతో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ‘మోదీ డౌన్, డౌన్, అక్రమ ఆరెస్ట్లను నిలిపివేయాలి, కేసీఆర్ జిందాబాద్’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాధాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ కేసు కొత్తదేమీ కాదని, రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో అనేక మంది వ్యక్తులను, వ్యాపారులను విచారించారని తెలిపారు.
తొలుత కవితను సాక్షిగా విచారించిన ఈడీ మహిళా హక్కులను హరించేలా అక్రమం గా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభు త్వ చెప్పుచేతల్లో పని చేస్తున్న ఈడీ, ఐటీ కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని కడియం విమర్శించారు. సికింద్రాబాద్ లో మోదీ రోడ్షోలో ఉన్న సమయంలో, ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు కవితను అరెస్ట్ చేశారని తెలిపారు. ఉద్యమ నేత కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని మోదీ కుట్రలు చేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మనుగడలో లేదని, బలంగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బ తీస్తే తప్ప బీజేపీ గెలువదనే భయంతోనే కవితను అరెస్ట్ చేయించారని కడియం విమర్శించారు.
లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మంది బీఆర్ఎస్ వారే ఉన్నారని, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నేతలను చేర్చుకుని సీట్లు ఇస్తున్నదన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయా పార్టీలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతుందని శ్రీహరి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అవమానాలకు గురి చేసినా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతుబంధు సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు ఇల్లందుల బేబి శ్రీనివాస్, చాడ సరిత, ఎంపీపీలు రడపాక సుదర్శన్, బొమ్మిశెట్టి సరితా బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు రాంబాబు, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, సుధాకర్బాబు, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు రజాక్ యాదవ్, మార్పు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కరుణాకర్రావు, రాజేశ్వర్ రెడ్డి, రాపోలు మధుసూదన్రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసేందుకే కేంద్రంలోని మోదీ సర్కారు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మం డిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదు ర్కోలేకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజ కీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పా ర్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీ యడానికే కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తు న్నారన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ పని చేస్తోందన్నారు. కోర్టులపై తమకు విశ్వాసం ఉం దని, అక్రమ కేసులో కవిత గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి, పాలకుర్తి, దేవరుప్పుల ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, బస్వ సావిత్రి మల్లేశం, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల అధ్యక్షులు పసునూరి నవీన్, సిందె రామోజీ, తీగల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మ న్లు పేరం రాము, ముస్కు రాంబాబు, ఎంపీటీ సీ అందె యాకయ్య, ప్రధాన కార్యదర్శులు మాచర్ల ఎల్లయ్య, చింత రవి, పాము శ్రీనివాస్, వీరమల్ల రాజు, దీకొండ వెంకటేశ్వర్రావు, కొ ల్లూరు సోమయ్య, వంగ అర్జున్, మేకల సంప త్, సాయిలు, కర్ణాకర్రెడ్డి, బాకీ ప్రేమ్కుమార్, మాటూరి యాకయ్య, నకీర్త యాకయ్య, కారుపోతుల వేణు, ఎండీ నాసర్ పాల్గొన్నారు.
దేవరుప్పుల : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్కు నిరసనగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఆందోళనకు దేవరుప్పుల మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. వీరిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, మండల ప్రధాన కార్యదర్శి చింత రవి, కొల్లూరు సోమయ్య, జేరిపోతుల సాయిలు, వంగ అర్జున్, తిరుమలేశ్, కుతాటి నర్సింహులు, వీరాచారి, పానుగంటి కృష్ణ, కొండాజీ, ఎన్నెం చంద్రమౌళి, గేమానాయక్, శ్రీధర్, భరత్ ఉన్నారు.