కేసీఆర్ సర్కారు ఇస్తున్న ‘ఆసరా’తో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు చేనేత, గౌడ కార్మికులు.. ఇలా అర్హులందరికీ నెలనెలా ఠంచన్గా నగదు జమకావడం కొండంత భరోసానిస్తున్నది. ఈ పథకం ద్వారా గడపగడపకూ లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతోంది. గురువారం వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరురంగంపేట గ్రామంలో స్థానిక పోస్టాఫీస్లో పలువురు లబ్ధిదారులు పింఛన్ డబ్బులు తీసుకొని చిరునవ్వుతో మురిసిపోతున్న దృశ్యాలు ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కాయి. తమకు ఆసరా అవుతున్న కేసీఆర్ సర్కారు సల్లంగుండాలని దీవించారు.
– వరంగల్ ఫొటోగ్రాఫర్, డిసెంబర్ 8
రోబో సెక్యూరిటీ
ములుగు మండలం దేవగిరిపట్నం మైనార్టీ గురుకులం పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఎండీ.హస్నా, పి.రివ్య హెచ్ఎం, గైడ్ టీచర్ శైలజతో కలిసి మానవాళికి రోబో అందించే సేవలపై ఎగ్జిబిట్ను రూపొందించారు. రోబోట్లను సెట్లలో ఉపయోగించడంతో పాటు వ్యవసాయ పనుల్లో కలుపు నియంత్రణ, పంట కోసే విధానాన్ని నేర్పే పద్ధతి, దవాఖాన్లలో ఆపరేషన్లు చేసే సమయంలో వైద్యులకు సహకరించే పద్ధతి, నీటి అడుగుభాగంలోని చిత్రాలు, డేటాను సేకరిస్తాయని వివరించారు.
ఇవి స్వయంగా వందలాది విభిన్న వంటకాలను స్పష్టించగలవని, భద్రత విషయానికి వస్తే మానవ మార్గ నిర్దేశంలో ఒక మిలిటరీని నిర్వహించడానికి శిక్షణ ఇవ్వవచ్చని, శత్రువులను పసిగట్టి దాడి చేయడంతో పాటు మెడికేర్ ఏజెంట్లుగా ఉపయోగపడుతాయని, ఇవి పూర్తిగా రిమోట్ కంట్రోల్తో వీటిని కంట్రోల్ చేసే విధానాన్ని విద్యార్థులు వివరించారు. అదేవిధంగా ఇంటి ఆవరణలో సెక్యూరిటీగా ఉంచుకొని వచ్చిన వ్యక్తుల ఫొటోను యజమానికి చేరవేసి నిర్ధారించుకున్న తర్వాత వారిని ఆహ్వానించే విధంగా కూడా ఉపయోగపడుతాయని వివరించారు.
బయో రెమిడియేషన్
ములుగు మండలం దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు సనా తస్లీమ్, వైష్ణవి, గైడ్ టీచర్ సరిత.. బయో రెమిడియేషన్ ఉపయోగంపై ఎగ్జిబిట్ను తయారు చేశారు. ఇది అన్ని బాహ్య వాతావరణాల నుంచి కాలుష్య కారకాలను తగ్గిస్తుంది. మెలల్స్ హైడ్రోకార్బన్లు, మట్టి నుంచి విషాన్ని తొలగించడం, పెట్రోలియం, చమురు చిందడం, సముద్రాల్లో వీటిని తొలగించి తాగునీటి కాలుష్యాన్ని కాపాడుతుంది. అలాగే పర్యావరణం నుంచి కాలుష్యాన్ని, భూగర్భ జలాలను పరిరక్షించి, వ్యర్ధ జలాలను వేరుచేయడం వంటితో పాటు మొక్కలు, గడ్డిని పెంచే కొత్త ఆవిష్కరణ ప్రదర్శించారు.