వేసవిలో గణనీయంగా పెరిగిన బీర్ల సేల్స్
ఏప్రిల్లో 96 శాతం ఉండగా మేలో 147 శాతానికి పెరుగుదల
రెండు నెలల్లో రూ. వంద కోట్ల బిజినెస్
ఎండ నుంచి ఉపశమనం కోసం మద్యంప్రియుల ఆసక్తి
సుబేదారి, మే 28: బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. వేసవిలో చల్లని బీర్లనే ఎక్కువగా తాగుతున్నారు. ఏప్రిల్, మే మూడో వారంలో హనుమకొండ జిల్లాలో లిక్కర్ కంటే బీర్ల విక్రయాలే గణనీయంగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 65 వైన్షాప్లు, 107 బార్లు ఉన్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగడంతో మద్యంప్రియులు ఉపశమనం కోసం రెండు నెలలుగా బీర్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని హనుమకొండ, వరంగల్ అర్బన్, కాజీపేట, ఖిలావరంగల్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న మద్యం షాపుల వద్ద బీర్ల కోసం క్యూ కడుతున్నారు. అలాగే బార్లలోనూ బీర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మార్చిలో 33శాతం విక్రయాలు జరగ్గా, ఏప్రిల్లో ఎండ వేడితో 96శాతానికి పెరిగాయి.
ఈ మే నెలలో 147శాతానికి పెరిగాయి. 15రోజులుగా బీర్ల విక్రయాలు మరింత ఘననీయంగా పెరిగాయి. మార్చిలో రూ.103 కోట్ల విలువైన లక్షా 67 వేల 253 పెట్టెల లిక్కర్, రూ.34 కోట్లు విలువైన లక్షా 10వేల 448 పెట్టెల బీర్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్లో రూ.102.02 కోట్ల విలువైన 97,789 పెట్టెల లిక్కర్, రూ.50 కోట్లపైగా విలువైన లక్షా 95 వేల 139 పెట్టెల బీర్లు అమ్ముడయ్యాయి. ఇక మే 26వ తేదీ వరకు 77,111 పెట్టెల లిక్కర్, 1,73,230 పెట్టెలను విక్రయిం చారు. ఈ రెండింటి విలువ రూ. 83.53 కోట్లు. ఇందులో బీర్ల సేల్స్ రూ. 54 కోట్ల 33 లక్షలు. ఈనెల ముగిసే వరకు రూ. 60 కోట్లు దాటుతుందని జిల్లా ఆబ్కా రీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రూ. 110 నుంచి రూ. 120 కోట్ల వరకు బీర్ల విక్రయాలు పెరిగాయి. రెండేళ్లలో కరోనా ఎఫెక్ట్తో బీర్ల సేల్స్ పూర్తిగా తగ్గి, లిక్కర్ సేల్స్ పెరిగాయి. ఇప్పుడు కరోనా తగ్గడం, ఎండలు దంచికొట్టడం వల్ల బీర్ల సేల్స్ ఘననీయంగా పెరిగాయి.