శాయంపేట, జూన్ 25 : శాయంపేటలో సొంత భవనంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన బీసీ బాలికల హాస్టల్ను ఎత్తేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా అడ్మిషన్లు తీసుకోకుండా, కళాశాల హాస్టల్గా అప్గ్రేడ్ చేసి హనుమకొండకు తరలించారు. దీంతో స్థానిక నిరుపేద విద్యార్థినులు నష్టపోతున్నారు. ఇన్నాళ్లు నాలుగో తరగతి నుంచి పదో తరగతి బాలికలకు వసతి కల్పించారు. ఇక్కడి వార్డెన్కు ఇటీవల బదిలీల్లో మహబూబాబాద్కు బదిలీ కాగా, మరో వార్డెన్ విధుల్లో చేరారు.
గతేడాది శాయంపేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 30 మంది బాలికలకు ఇక్కడ వసతి కల్పించారు. స్కూల్ పిల్లలు హాస్టల్కు రావడం లేదని కాలేజీ హాస్టల్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు కమిషనరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయని వార్డెన్ రజిత తెలిపారు. హనుమకొండలో బిల్డింగ్ చూస్తున్నారని, దొరకగానే ఇక్కడి నుంచి తరలిస్తామని, అక్కడ ఇంటర్ నుంచి పీజీ వరకు బీసీ బాలికల హాస్టల్ కొనసాగుతుందని వివరించారు.