తాడ్వాయి, ఫిబ్రవరి19 : మేడారం జాతర సందర్భంగా బ్యాటరీ కారును దేవాదాయశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నడవలేని సీనియర్ సిటిజన్లను గద్దెల ప్రాంగణం వరకు తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు దీనిని వినియోగించనున్నారు.
దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి సోమవారం బ్యాటరీ కారును తీసుకువచ్చారు. నేటి నుంచి ఈ కారును అందుబాటులోకి తేనున్నారు.