దుగ్గొండి, మే 17 : మానవ సంబంధాల విలువలను తెలియజేస్తూ బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రజానీకాన్ని కన్నీరు పెట్టించిన బలగం మొగిలయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. దుగ్గొండి మండలం కేంద్రానికి చెందిన బుడిగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య- కొమురమ్మ దంపతులకు ఇటీవల అనారోగ్య కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. మొగిలయ్యకు రెండు కిడ్నీలు చెడిపో గా, నిత్యం డయాలసిస్ చేసుకుంటున్నారు. బల గం సినిమాతో తనకున్న కళానైపుణ్యంతో పాటు తనకున్న జబ్బుకూడా బయటి ప్రపంచానికి తెలిసింది. మొగిలయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పందించి చికిత్స కోసం మొగిలయ్యను దవాఖానలో చేర్పించారు.
ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమ త లేక పోవడంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వారిని హైదరాబాద్లో దవాఖానలో చేర్పించి, చికిత్స అందించారు. మొగిలయ్య ఆర్థిక పరిస్థితిని చూసి సీఎం కేసీఆర్ స్పం దించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. మొగిలయ్య కుటుంబం ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని మంత్రి దయాకర్రావు, ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లా డి దళితబంధు పథకంలో ఎంపిక చేశారు. ఈ మేరకు మొగిల య్య దంపతులకు మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంజూరు పత్రాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్లో మంత్రుల ని వాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, ఆరూరి రమేశ్, బేడ బు డిగ జంగాల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, వైస్ చైర్మన చింతల యాదగిరి సమక్షంలో మొగిలయ్య దంపతులను సన్మానించి, కారును అందజేశారు. మొగిలయ్య అరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించారు.
రుణపడి ఉంటాం..మొగిలయ్య-కొమురమ్మ దంపతులు
అనారోగ్యంతో బాధపడుతూ చావు అంచుల దాకా వెళ్లిన తమకు అండగా నిలిచి, నిమ్స్ దవాఖానలో చేర్పించి, చికిత్స అందిస్తున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. అన్ని విధాలా అండగా నిలిచిన మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నర్సంపేట, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, ఆరూరి రమేశ్, సుంకె రవిశంకర్, జోగినపల్లి శ్రీనివాస్రావు, బేడ బుడిగ జంగాల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.