వర్ధన్నపేట, డిసెంబర్ 26 : అకేరు వాగు ఒడ్డున ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప మండల మహా పడిపూజ కనుల పండువగా జరిగింది. పడిపూజ కార్యక్రమంలో అరూరి విశాల్ పాల్గొన్నారు. ప్రముఖ గురుస్వామి, పండిట్ రఘునందన్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మంఠపంలో గణపతి పూజ, పుణ్యాహవచనంతో పాటు 18 కలశాల పూజ చేశారు.
అనంతరం దేవాలయంలోని 18 మెట్లకు ప్రత్యేక పూజలు చేసి పడిని వెలిగించారు. మాలధారులు పేటతుళ్లి వేశారు. అనంతరం సుమారు 900 మంది స్వాములకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఇల్లంద సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు గొడిశాల శ్రీనివాస్, పిట్టల జ్యోతి, ఉపసర్పంచ్ రాజ్కుమార్, ప్రముఖ గాయకుడు రాము పాటల బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.