వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలు వేగంగా జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోగా ఎంపికలు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో దళితబంధు పథకం లబ్ధిదారులకు అధికారులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఎంపీపీ అనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళితబంధు పథకం తొలి విడత అమలుకు రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామాన్ని ఎంపిక చేశారు. పథకానికి ఎంపిక చేసిన 20 మంది లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పథకం అమలుపై లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించారు.