సుబేదారి, మే 13: గంజాయి రహిత వరంగల్ కమిషనరేటే లక్ష్యంగా పనిచేయాలని సీపీ తరుణ్జోషి ఆదేశించారు. గంజాయి నియంత్రణ, రోడ్డు భద్రత -ట్రాఫిక్ నియమాలపై ‘అవేకెన్ వరంగల్’ పేరుతో రూపొందించిన పోస్టర్ను సీపీ తరుణ్జోషి శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపిందని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా చూడాలని ఆదేశించారు.
రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలను జాగృతం చేయడానికి అవేకెన్ వరంగల్ అనే కార్యక్రమాన్ని రూపొందించామని సీపీ పేర్కొన్నారు. రోడ్డు సేఫ్టీపై జాతీయ, అంతర్జాతీయ మాడల్స్, అథ్లెట్స్తో ఈనెల 16న కేఎంసీలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా సినిమా యువ హీరో హాజరవుతున్నట్లు వెల్లడించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డీసీపీలు అశోక్, వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ వైభవ్గైక్వాడ్, హనుమకొండ ఏసీపీ జితేందర్ పాల్గొన్నారు.