హనుమకొండ, మే 27 : కార్మికుల సంక్షేమం కోసమే కార్మిక సంక్షేమ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లాండ్రీ షాప్ వరర్స్ యూనియన్, చిరు వ్యాపారులు, పోస్టల్ శాఖ, రైల్వే యూనియన్, కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ సారయ్యతో కలిసి చీఫ్విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎకడా లేని విధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మే నెల మొత్తం కార్మికుల కోసం ఉత్సవాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మాసోత్సవాల్లో కార్మికుల ఐక్యత, ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధి కోసం కృషి చేస్తూ పలు రకాల వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రానికి దిక్సూచిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నిలిచిందన్నారు.
కార్మికుల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, లేబర్ కార్డు లేని కార్మికులను గుర్తించి, వారికి అవగాహన కల్పించి కార్డులను ఇప్పించినట్లు తెలిపారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల ఐక్యతే ధ్యేయంగా కార్మిక సంక్షేమ మహోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్మికుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని కొనియాడారు. ఈ నెల 31న ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్మిక యుద్ధభేరీ మహాసభను కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎకడా లేనివిధంగా కార్మిక సంక్షేమ మాసోత్సవాలు నిర్వహించడంలో వినయ్భాసర్ చొరవ అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని అభినందించి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్మిక ఉత్సవాలను జరుపుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారని తెలిపారు. కార్మికుల కోసం ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి మీ నాయకుడిగా ఉండడం అదృష్టం అని కొనియాడారు. వినయ్ భాసర్తో కలిసి కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వారి శ్రేయస్సుకు కృషి చేస్తానని వినోద్కుమార్ హామీ ఇచ్చారు.
‘మున్నూరు కాపు’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కొమురవెల్లిలో మున్నూరు కాపు సత్రం నిర్మించడం అభినందనీయమని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ అన్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవన నిర్మాణానికి భూమి పూజ వాల్ పోస్టర్ను శనివారం బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి చీఫ్విప్ ఆవిషరించారు ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. భవనం కోసం భూమిని దానం చేసిన ఉప్పు పద్మ, డాక్టర్ ఉప్పు రవీందర్ను అభినందించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు కుల బంధువులు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ప్రవీణ్ పటేల్, శెట్టి మురళీ పటేల్, మోతూరి రాజయ్య పటేల్, ఉమేశ్ పటేల్, తాతన్న పాల్గొన్నారు.