హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశానికి దిక్సూచిగా మారనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం హనుమకొండలోని అశోకా కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ భద్రకాళి బ్రహ్మోత్సవాల అంకుర్పారణకు మొదటిరోజు మున్నూరుకాపులకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. మున్నూరుకాపు చైతన్యవంతులు కావాలని, విభేదాలు లేకుండా ఐక్యంగా ఉండాలని సూచించారు.
చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయా కార్పొరేషన్ల చైర్మన్లంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి మున్నూరుకాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్తో పాటు కోకాపేటలో భవన నిర్మాణానికి మరిన్ని నిధులు సాధిస్తామన్నారు. హనుమకొండ కాపువాడలో ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన తల్లిదండ్రులు వెంకటనర్సమ్మ, నారాయణ పేరిట రూ.51లక్షలు అందజేస్తానని రవిచంద్ర హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లా నుంచి గ్రామాల వరకు ఎన్నికలు నిర్వహించి, నూతన కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో కాపు భవనాన్ని నిర్మించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల వరకు ప్రత్యేక కార్పొరేషన్ సాధిస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ హైదరాబాద్లో కులసంఘానికి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. చీఫ్ విప్ వినయ్భాస్కర్, జలవనరులశాఖ ఛైర్మన్ ప్రకాశ్ ఆధ్వర్యంలో కాపు భవనానికి రూ.5 కోట్లు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే, మేడారంలో కాపు సత్రం ఏర్పాటు అందరూ కృషి చేయాలన్నారు.
మున్నూరుకాపు భవన నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మాస్టర్ ప్లాన్లో కుడా, కార్పొరేషన్ అనుమతి ఇవ్వకపోవడంతో కొంత ఆలస్యమవుతోందన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే రూ.60లక్షలు అనుమతుల కోసం మాఫీ చేయించినట్లు గుర్తుచేశారు. త్వరలోనే భవన నిర్మాణానికి ముందడుగు వేయనున్నట్లు చెప్పారు. కాపుసంఘం భవనం అన్నివిధాలుగా ముందుతరాలకు ఉపయోగపడేలా నిర్మిస్తామని, సంఘానికి ఆదాయం వచ్చేలా కన్వెన్షన్ హాల్తో పాటు హాస్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అన్ని కుల సంఘాలకు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు.
మున్నూరుకాపులు తాము వెనుకబడిన వారమనే భావన వీడాలని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిందని తెలిపారు. మున్నూరుకాపు భవన నిర్మాణానికి పరపతి సంఘాల్లోని ఒక్కొక్కరి నుంచి రూ.100 విరాళాలు సేకరించాలన్నారు. అమెరికాలో మొదటి కులసంఘం బ్యాంకు మనదే కాబోతోందన్నారు. ము న్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య మాట్లాడుతూ పరస్పర సహకారం, ఐకమత్యంతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మేళనంలో కార్పొరేటర్ చెన్నం మధు, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్, వద్దిరాజు వెంకటేశ్వర్లు, రంజితా కృష్ణమూర్తి, శోభారాణి, మాజీ కార్పొరేటర్ పుప్పాల ప్రభాకర్, కూసం శ్రీనివాసులు, బండి కుమారస్వామి, మాడిశెట్టి శివశంకర్, నాడెం శాంతకుమార్, పార్టీ శ్రీనివాస్, మాందాటి మనోజ్, పెరారి శ్రీధర్, పూజారి సత్యనారాయణ, వద్దిరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర, వినయ్భాసర్, ప్రకాశ్ను గజమాలతో సతరించారు. అనంతరం కాపు భవన నిర్మానానికి మెతుకు రాజగోపాల్ రూ.2 లక్షల చెక్కును అందజేశారు. అలాగే, తులా చందర్రావు అల్లుడు శశాంక్ రూ.50 వేలు అందిస్తున్నట్లు ప్రకటించారు.