వరంగల్, అక్టోబర్ 13 : బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు రావడంతో సొంతూళ్లకు జనం పయనమవుతున్నారు. దీంతో ముల్లెమూట సర్దుకొని విద్యార్థులు, పిల్లాపాపలను వెంటబెట్టుకొని వెళ్లే పెద్దలతో బస్స్టేషన్లు సందడిగా మారాయి.
శుక్రవారం పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రయాణికులతో హనుమకొండ బస్స్టేషన్ కిటకిటలాడుతూ కనిపించింది. పండుగ కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నది.