కరీమాబాద్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించే నరకాసురవధ కార్యక్రమానికి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. సోమవారం ఉర్సు రంగలీల మైదానాన్ని అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమ విజయవంతానికి పూర్తిగా సహకరిస్తానన్నారు. కమిటీ కన్వీనర్ మరుపల్ల రవి పలు విషయాలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శతపతి శ్యాలరావు, కనుకుంట్ల రవి, వనం మధు, ఆవునూరి రాంమూర్తి, వనం కుమార్, మరుపల్ల గౌతమ్, మాటేటి శ్యాం, మిరియాల ఆదిత్య, వంగరి సురేశ్, అన్న కుమారస్వామి, మరుపల్ల శివ, అంకం రామనాథం, నర్సింహా, కొమ్ము రాజు, పోలం రంజిత్, కనుకుంట్ల శివసాయి, కంది అఖిల్సాయి తదితరులు పాల్గొన్నారు.