హసన్పర్తి, సెప్టెంబర్ 26 : అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 65వ డివిజన్ పరిధి దేవన్నపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు కుల సంఘాల నాయకులు సుమారు 100 మంది ఎమ్మెల్యే రమేశ్ సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, దేవన్నపేటకు చెందిన రజక సంఘం, గౌడ కుల సంఘం నాయకులు ఎమ్మెల్యే అరూరి రమేశ్కు మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధిస్తామన్నారు.
తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేసి, వారిని ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్నదన్నారు. దేవన్నపేటలో రూ.40కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. అలాగే రూ.40 లక్షలతో నాలుగు కులసంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలు అందజేసినట్లు తెలిపారు. కొత్తపాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుగులోత్ దివ్యరాణీ రాజునాయక్, ఆత్మ చైర్మన్ పంజాల భూపాల్గౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పోలెపెల్లి, రాజు (మైకెల్), పీఏసీఎస్ డైరెక్టర్ విజేందర్, మాజీ సర్పంచ్ రవి, నాయకులు సూరం వాసుదేవరెడ్డి, గౌడసంఘం అధ్యక్షుడు జనుగాని పరమేశ్వర్, రజకసంఘం అధ్యక్షుడు పొలెపెల్లి సాంబ య్య, శ్రీపతి గోవర్ధన్, పోలెపెల్లి కరుణాకర్, చుంచు రాజేందర్, అయిలయ్య, విక్రమ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ ఒకటో డివిజన్ పరిధిలోని పలివేల్పులలో రజక సంఘం అధ్యక్షుడు చీకటి గురురాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో ఎమ్మెల్యే అరూరి పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణాకుమారి, డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, నాయకులు చల్లా వెంకటేశ్వర్రెడ్డి, ఉపాధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి శివరాజ్ పాల్గొన్నారు. అలాగే, 55వ డివిజన్ పరిధిలోని భీమారంలో రూ.10లక్షలతో నూతనంగా నిర్మించనున్న గౌడ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే ఆ కుల సంఘం సభ్యులకు అందజేశారు. సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే రమేశ్ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రజితావెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, డివిజన్ యూత్ అధ్యక్షుడు సాయి, ఎర్రగట్టు గుట్ట ఆలయ చైర్మన్ లక్ష్మణ్, గౌడ సంఘం అధ్యక్షుడు బూర రాజేందర్, సంఘం నాయకులు శ్రీకాంత్, సుభాశ్, సంతోశ్, రామకృష్ణ, నరేందర్, శ్రీధర్ పాల్గొన్నారు.
నయీంనగర్ : గ్రేటర్ 65వ డివిజన్ సుబ్బయ్యపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అరూరి కండువా కప్పి ఆహ్వనించారు.
కరీమాబాద్ : తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఖిలావరంగల్ మండలానికి చెందిన 362 మంది రైతులకు రూ.2.65 కోట్ల పంట నష్టపరిహారం చెక్కును మామునూరులో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా చేశారన్నారు. ఇటీవల జరిగిన విపత్తులతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతు బిడ్డగా, రైతుల పక్షపాతిగా రైతులను అన్ని విధాలా కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా మారిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మితో రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తూ పేదింటి పెళ్లి పెద్దగా కేసీఆర్ నిలిచారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. 43, 44 డివిజన్లకు చెందిన 24 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి అమ్మాయి పెళ్లికి తల్లిదండ్రులకు భారం కాకూడదని కల్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.