తొర్రూరు : ఈ సభకు హాజరైన లక్ష మందిని చూస్తే పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు గెలువడం, రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అర్థమవుతున్నదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్రావు ధీమాగా చెప్పారు. తొర్రూరు సభలో ఆయన మాట్లాడుతూ.. దయాకర్రావు వెంటే నేనున్నానని.. ఆయన గెలుపులో భాగస్వామిగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు.
కొంతమంది చేస్తున్న అనవసర ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని భారీ మెజార్టీతో దయాకర్రావును గెలిపించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో మరోసారి పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో అండగా నిలిచిందన్నారు. సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3వేలు, తెల్లరేషన్కార్డు ఉన్న వారందరికీ రూ.5లక్షల బీమా, రైతుబంధు, పెన్షన్ల పెంపు వంటి అనేక పథకాలు రాష్ట్ర ప్రజలకు వరంగా మారనున్నాయని పేర్కొన్నారు.