సంగెం, మార్చి 17: ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం హనుమకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి, మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, నరహరి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీను, వాసం రాజేందర్, అశోక్, సుమలత, సరిత, సూరయ్య, ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు బాల్నె యాకయ్య, రాజు, శ్రీశైలం, కుమారస్వామి, వెంకటేశ్వర్లు, బాబు, కిషన్, అరుణ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.