ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్
పీవోగా ఐఏఎస్ను నియమించడంపై గిరిజనులు హర్షం
ఏటూరునాగారం, జూన్ 12 : ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా అంకిత్ను నియమిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టు 8న ఇక్కడ పీవోగా పనిచేస్తున్న హన్మత్ కె జెండగేను బదిలీ చేయడంతో అప్పటి నుంచి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. కాగా, ఉట్నూరు ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న అంకిత్ను ప్రభుత్వం ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా బదిలీ చేసింది.
ఉత్తరప్రదేశ్ చెందిన అంకిత్ గతంలో వనపర్తి అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఉట్నూరు పీవోగా బదిలీ అయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అంకిత్ ఉట్నూరు పీవోగా పనిచేయ డం వల్ల గిరిజన సంక్షేమం, వారిపై అవగాహన ఉంది. కొంత కాలంగా ఖాళీ ఉన్న ఈ పోస్టు పది నెలల తర్వాత భర్తీకి నోచుకుంది. పీవోగా ఐఏఎస్ను నియమించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.