పాలకుర్తి, డిసెంబర్ 28 : మండల కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా ఈ విగ్రహాలు బయటపడినట్లు కూలీలు తెలిపారు. రాతిబండ పై రెండు పాదాలతో కూడిన రూపం కలిగి ఉందని పేర్కొన్నారు. పురావస్తుశాఖ అధికారులు ఈ విగ్రహాలను పరిశీలిస్తే ఏ కాలానికి చెందినవో తెలుస్తుందని స్థానికులు తెలిపారు.