దేవరుప్పుల, ఫిబ్రవరి ;రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రికి డప్పు వాయిద్యాలు, కోలాటాలు, చిందు కళాకారులు వేషధారణలు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దళితబంధు ప్రవేశపెట్టి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు అందించలేని దుస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం, గోదావరి, కృష్ణా నదుల నీటిని బీడు భూములకు మళ్లించారని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం తపన పడిన అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారని చెప్పారు.
షేక్ బందగీ స్మారక మందిరానికి శంకుస్థాపన
కామారెడ్డి గూడెం స్టేజీ వద్ద ఉన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు షేక్ బందగీ స్మారక మందిర నిర్మాణానికి సీడీఎఫ్ నుంచి నిధులు కేటాయించగా శనివారం మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గానికి ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. రామాయణం రాసిన వాల్మీకి నడయాడిన నేల వల్మిడి, మహా భాగవతాన్ని రచించిన పోతన బొమ్మెర వాడని తెలిపారు. సోమనాథ మహాకవి పాల్కురికికి చెందిన వాడు కావడం మన అదృష్టమన్నారు. వీటన్నంటిని కలుపుతూ టూరిజం కారిడార్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు చాకలి ఐలమ్మ పాలకుర్తికి చెందిన వారు కాగా, పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కడవెండి బిడ్డ, రజాకార్ల అఘాయిత్యాపై అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన షేక్ బందగీ కామారెడ్డిగూడెం వాస్తవ్యుడని వివరించారు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ కోసం తపించి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి ఇక్కడి గొల్లపెల్లికి చెందిన వాడని తెలిపారు. ఇంతటి విశిష్టత ఉన్న పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు.
ఆలయాలకు శంకుస్థాపన
కామారెడ్డిగూడెంలో రామాలయ ప్రహరీ, యాదవ కులదైవం గంగదేవి, కుర్మలకు చెందిన బీరప్పగుడి, గౌడకులానికి కాటమయ్య ఆలయాలకు నిధుల మం జూరు చేయగా, శనివారం ఎర్రబెల్లి భూమిపూజ చేశా రు. దేవరుప్పులలో యాదవుల గుడి, ఈదమ్మ, ముదిరాజ్ కుల దైవమైన పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. కాగా, కల్యాణలక్ష్మి ఆయన చెక్కులు పంపిణీ చేశారు. అంబేద్క ర్ విగ్రహావిష్కరణ సభకు కామారెడ్డిగూడెం మాజీ స ర్పంచ్ సోమయ్య అధ్యక్షత వహించగా, విగ్రహ నిర్మా ణ బాధ్యుడు రవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.