రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై వరాల జల్లు కురిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాస న సభలో ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో ఓరుగల్లుకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వరంగల్ హెల్త్సిటీలో భాగంగానే రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే, జిల్లాలో మరిన్ని బస్తీ, పల్లె దవాఖానలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమల్లోకి రానుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరిన్ని వసతులు కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. సొంత జాగ ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు, ప్రతి నియోజకవర్గానికి రెండు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయడంతో సకల జనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. రూ.1100 కోట్లతో 2 వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనం పనులు శరవేగంగా చేయిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలన్న బలమైన సంకల్పంతో ముందుకు పోతున్నది. పేదలకు కార్పొరేట్ వైద్యం కోసం తగిన భవనాలు, వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయపడుతున్నది’ – రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక అంశమిది..
వరంగల్, ఫిబ్రవరి 6(నమస్తేతెలంగాణ) : సంక్షే మం, అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం రూ.2,90,396 కోట్లతో శాసనసభలో 2023-24 వార్షిక బడ్జెట్ సమర్పించారు. ప్రతిరంగానికి నిధులు కేటాయించారు. ఈ సంవత్స రం మరిన్ని కొత్త పథకాలు అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్రావు జిల్లాకు సం బంధించి పలు అంశాలను ప్రస్తావించారు.
ప్రధానంగా వరంగల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం హెల్త్ సిటీ నిర్మాణం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.1,100 కోట్లతో చేపట్టిన రెండు వేల పడుకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పనులను పూర్తి చేసి ప్రారంభించాలనే బలమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని, అందు కు తగిన స్థాయిలో భవనాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతున్నట్లు తెలిపారు.
బస్తీ దవాఖానల స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లోని ఏఎన్ఎంల సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో ప్రాథమిక వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ఉన్నవాటికి తోడుగా ఒక్కో పట్టణంలో వంద బస్తీ దవాఖానలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీంతో జిల్లాలో మరిన్ని బస్తీ దవాఖానలు ఏర్పడడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా అప్గ్రేడ్ కానున్నాయి. వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలందించే ఉద్దేశంతో ‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా అమల్లోకి రానుంది. గర్భిణుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఈ ఏడాది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఎనిమిది జిల్లాల్లో ప్రవేశపెట్టింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్కర్నూలు, వికారాబాద్ జిల్లాల్లో డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించింది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 33 జిల్లాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సభలో మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
ఈ నిర్ణయంతో సుమారు 4 లక్షల మం ది గర్భిణులు ప్రతి సంవత్సరం లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ పథకం అమలుకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు అనుకూలత ఉండడం, దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉన్నందున సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రైతులకు ఆయిల్పామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్పై ఇస్తున్న భారీ సబ్సిడీల కోసం బడ్జెట్లో రూ.1,000 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో సొంత జాగ ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం అందజేయనున్నట్లు మంత్రి హరీశ్రావు శాసనసభలో ప్రకటించారు. ప్రతి శాసనసభ ని యోజకవర్గంలో రెండు వేల మందికి రూ.3 లక్షల చొ ప్పున అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించిం ది. స్థానిక సంస్థలకు మంత్రి మరో శుభవార్త చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఫైనా న్స్, ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడకుండా స్వ తంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకం అమలు కోసం ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు ప్రదిపాదించినట్లు మం త్రి హరీశ్రావు వెల్లడించారు. ఆయన ప్రవేశపెట్టిన వా ర్షిక బడ్జెట్ పట్ల సకల జనులు హర్షం వ్యక్తం చేశారు.
వరంగల్, (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర వార్షిక బడ్జెట్ సకల జనులకు సంతోషం కలిగించింది. పంట రుణాల మాఫీ, సొంత జాగ ఉన్న వారికి ఇండ్లు, దళితబంధు పథకం అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయించడం అభినందనీయం. రుణ మాఫీతో పాటు సొంత జాగ ఉన్నోళ్లకు ఆర్థికసాయం చేసేందుకు రూ.12 వేల కోట్లు, దళితబంధు పథకానికి రూ.17వేల కోట్లకుపైగా నిధులను ప్రతిపాదించడంతో సంతోషదాయకం. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యవసాయరంగం, విద్య, వైద్యానికి కూడా బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది.
– బూసాని రమేశ్, గ్రాడ్యుయేట్, తొగర్రాయి, దుగ్గొండి