హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 1 : హనుమాన్నగర్లోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఎయిడ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడారు. విద్యార్థులు ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.
సెల్ఫోన్లలోని అసభ్యకరమైన అంశాలకు ప్రభావితం కాకూడదని, ప్రణాళికాబద్ధమైన, ఆరోగ్యకరమైన జీవనవిధానం అలవర్చుకోవాలని సూచించారు. సదస్సులో కళాశాల డైరెక్టర్ ముచ్చ జితేందర్రెడ్డి, ప్రిన్సిపాల్స్ తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.