నర్సంపేట, జనవరి 12: సంస్కృతీ సంప్రదాయాలను అందరూ కాపాడాలని బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలోని బాలాజీ హైస్కూల్లో గురువారం సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో విద్యాసంస్థల ట్రెజరర్ డాక్టర్ వనజ, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాల్ ఊడుగుల జ్యోతి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్రాజ్ పాల్గొన్నారు. అలాగే, భారత మహిళా సమైక్య ఎన్ఎఫ్డబ్ల్యూ ఆధ్వర్యంలో మాదన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం పాలక కవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ మోతె నవత పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేశ్, డాక్టర్ రజిత, తోట చంద్రకళ, చెన్నకేశవులు, మియాపురం గోవర్ధన్, అయితయాకు, గడ్డం నాగరాజు, చిట్టె మమత, వడ్లకొండ యశోద, దేవపాల్ పాల్గొన్నారు.
ఆడ పిల్లలను రక్షించాలి
నర్సంపేట/నర్సంపేటరూరల్/కరీమాబాద్/కాశీబుగ్గ/సంగెం: ఆడపిల్లలను రక్షించాలని సిద్ధార్థ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పట్టణంలోని కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలను ఆయన అభినందించారు. అలాగే, మాంటిస్సోరీ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎర్ర జగన్మోహన్రెడ్డి, ఊర్మిళ పాల్గొన్నారు.
నర్సంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. ప్రిన్సిపాల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్రెడ్డి, ఏవో సలేంద్ర సురేశ్, ఉపాధ్యాయులు యాకూబ్రెడ్డి, రాజేశ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్తోట కివీ పాఠశాలలో ప్రిన్సిపాల్ దాసి సతీశ్మూర్తి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఉర్సు బైపాస్రోడ్డులోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ పాఠశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్లు తాళ్ల వంశీ-చైతన్య, డాక్టర్ వరుణ్-వైష్ణవి, హెచ్ఎం స్వర్ణ పాల్గొన్నారు. బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో బాలల రంగస్థల ఉత్సవాలు నిర్వహించారు.
హెచ్ఎం విజయ్కుమార్ పాల్గొన్నారు. కాశీబుగ్గలోని నరేంద్రనగర్ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు సుధాబిందు, సునీతాదేవి, కళావతి, సుజాత, సరిత, శ్రీవాణి, శ్రీలత, సదాలక్ష్మి, వనజ, రమణి, మమత విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందించారు. సంగెం మండలం ముమ్మిడివరంలోని సిద్ధార్థ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం భోగి పండ్లతో విద్యార్థులను ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. ఉత్తమ ముగ్గులు వేసిన బాలికలకు హెచ్ఎం తీగారపు సుధాకర్ బహుమతులు అందజేశారు.