హనుమకొండ, జనవరి 28 : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ హంటర్రోడ్డు కాకతీయ జూపార్లోని నీల్గా య్, సాంబార్ డీ ర్, చౌసింగా, అడ వి దున్నలను ఒ క్కొకటి చొప్పున దత్తత తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం జూ పార్ అసిస్టెంట్ క్యురేటర్ మయూరి దత్తత ప్ర క్రియను పూర్తి చేశారు. ఏడాది కాలానికి ఒకో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం రూ.50 వేల చొప్పున మొత్తం నాలుగు వన్యప్రాణులకు కలిపి రూ.2 లక్షలను మంత్రి సురేఖ ఆన్లైన్లో చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వన్యప్రాణులను దత్తత తీసుకునేందు కు పక్షి, జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న పక్షులు, తాబేళ్లు మొద లు పులుల వరకు మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున దత్తత తీసుకుని, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చని మంత్రి తెలిపారు. మార్గదర్శకాలను అనుసరించి, వారి ఇష్టానుసారం జంతువులను దత్తత తీసుకునే వెసులుబాటును అటవీశాఖ కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం చేసిన చెల్లింపులకు ఆదాయ పన్ను మినహాయింపు, ఇతర ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అటవీ అధికారులకు మంత్రి సూచించారు.