టేకుమట్ల : తెలంగాణలో మరింత అభివృద్ధి జరగాలం టే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కూతురు, కోడలు ప్రియాంకరెడ్డి, వైశాలి అన్నారు. శుక్రవారం మండలంలోని గర్మిళ్లపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వారు ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గండ్రను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్దిని, సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవి, సర్పంచ్ నల్లబెల్లి రమ, పుప్పాల రాజు, ఏనుగు తిరుమల, దొడ్ల కోటి, రవీందర్, లచ్చిరెడ్డి, నర్సింగరావు, సారయ్య, పెరుమాండ్ల మొగిలి, తిరుపతి, బందెల నరేశ్ పాల్గొన్నారు.
గణపురం : భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజాప్రతినిధులు, నాయకులు శుక్రవారం ఇంటింటా ప్ర చారం నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, చెల్పూరులో సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావుతో పాటు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ కమిటీ అధ్య క్ష, కార్యదర్శులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో రమాదేవీ మధుకర్, అయిత రమేశ్, జెట్టి కనకరాజు, రజియా, పిన్నింటి శ్రీనివాస్రావు, అంజాద్పాషా, అల్లూరి శ్రీనివాస్, కళ్లెపు రవీందర్, పవన్, సుధాకర్, సతీశ్ కుమార్, గుర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గులాబీ శ్రేణులు ప్రచారాన్ని కొసాగిస్తున్నారు. శుక్రవారం లక్ష్మీపూర్తండా గ్రామంలో జడ్పీటీసీ గొర్రె సాగర్ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. భూపాలప ల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అదే గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించా రు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య, టౌన్ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్గౌడ్, నాయకులు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు.
శాయంపేట : మండలంలోని మైలారంలో భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును కో రుతూ నాయకులు శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, సర్పంచ్ ప్రసాద్ బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు మ్యానిఫేస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో విజయ, అర్జ ల సునీతాసాంబరెడ్డి, దూదిపాల రాజిరెడ్డి, చల్లా సంజీవరెడ్డి, బత్తిని తిరుపతి, నూనె కిరణ్, మోతె సమ్మయ్య, దూ దిపాల మోహన్రెడ్డి, బత్తిని ఐలయ్య, బొంతల శంకర్, మ సె భాసర్, ఏనుగుల దిలీప్, దూదిపాల రామిరెడ్డి, మోతె కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.