హనుమకొండ, మార్చి 2 : హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం కిచెన్లో పొగ గొట్టాలు క్లీనింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ గొట్టాలు ఆయిల్తో నిండి ఉండడంతో క్షణాల్లో కిచెన్ అంతటా మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకుని మంటలను పూర్తిగా చల్లార్చారు. కాగా, హోటల్ నుంచి భారీగా పొగలు రావడంతో చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురయ్యారు.