మంగపేట డిసెంబర్15: ఇటీవల వచ్చిన తు ఫాను ప్రభావంతో తన మిర్చి తోట దెబ్బతినగా, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు మీద పడతాయని ఆందోళనకు లోనైన ఓ రైతు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన మండలంలో ని తిమ్మంపేటలో జరిగింది. కుటుంబ సభ్యులు, సహచర రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు పోకల పుల్లయ్య(50) మల్లూరు అత్త చెరువు సమీపంలో తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో ఈ ఏడాది మిరప తోట సాగు చేశాడు. అయితే, ఇటీవల తుఫాను కారణంగా మిరప చెట్లన్నీ చనిపోయాయి.
ఈక్రమంలో ఆందోళనకు లోనైన పుల్లయ్య పంట పెట్టు బడి కోసం తీసుకొచ్చిన అప్పులు తీర్చలేనేమో నన్న భయంతో ఈ నెల 14న తన పొలం వల్ల గడ్డి మందు తాగి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తర లించారు. పుల్లయ్యకు చికిత్స అందిస్తుండగా పరి స్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృ తుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.