సుబేదారి, ఆగస్టు 3: ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ ప్రజలను నమ్మిస్తూ వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ తరుణ్జోషి.. నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. వరంగల్కు చెందిన ముజతాబా అహ్మద్ బీ ఫార్మసీని మధ్యలోనే ఆపేసి, ఓ డాక్టర్ వద్ద సహాయకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తాడు.
ఇందుకోసం ఎయిమ్స్ డాక్టర్ అంటూ నకిలీ సర్టిఫికెట్ తయారు చేశాడు. మరో వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ దామెరకొండ సంతోష్తో కలిసి వరంగల్ చింతల్ ప్రాంతంలో 2018లో హాస్పిటల్ ప్రా రంభించాడు. ల్యాబ్లో చేసిన వైద్య పరీక్షల ఆధారంగా రోగులకు చికిత్స చేశాడు. రోగం పేరుతో భయపెట్టి, ఇతర దవాఖానలకు పంపించి పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకునేవాడు. నాలుగేండ్ల నుం చి 43 వేల మంది రోగులకు వైద్యం చేశాడు. విష యం టాస్క్ఫోర్స్ పోలీసులకు తెలియడంతో బు ధవారం ముజతాబా ఆహ్మద్ తోపాటు ల్యాబ్ టె క్నీషియన్ సంతోష్కుమార్ కూడా అరెస్టు చేశారు. వారి నుంచి 1.90 లక్షల నగదు, ల్యాప్టాప్, మూడు సెల్ఫోన్లు, ల్యాబ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభచాటిన టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, సీఐలు నరేశ్కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సై లవన్కుమార్, సిబ్బంది అనిల్, శ్యాంసుందర్, సోమలింగం, అశోక్ ను సీపీ అభినందించారు.