మంగపేట, డిసెంబర్ 17 : నలభై ఒక్క రోజు పాటు దీక్ష చేసి, శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు మార్గ మధ్యంలోనే అనంత లోకాలకు వెళ్లారు. స్వాములు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వాల్ను ఢీకొట్టడం తో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంద గా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తెని జిల్లా పెరియాకుళం మండలం దేవనపట్టి బైపాస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. మృ తుల కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. ములుగు జిల్లా మంగపేట మం డలం కమలాపురం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు తలారి సుబ్బయ్యనాయుడు(49), నర్రా సాంబశివరావు (51), నిమ్మల వెంకట రాజు(60), జరుపుల రాము, కూనూరు అజయ్ మాల ధరించి 41 రోజుల పాటు దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ నెల 14న గ్రామ పొలిమేరలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఇరుముడులు కట్టుకొని అదే రోజు ఏటూరునాగారానికి చెందిన ఓ అద్దె కారులో శబరిమల బయలు దేరారు. కాగా, అయ్యప్పస్వామి దర్శనం పూర్తి చేసుకొని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రంలోని తెని జిల్లా పెరియాకుళం మండలం దేవనపట్టి బైపాస్ రోడ్డు మీదుగా వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వాల్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సుబ్బయ్యనాయుడు, సాంబశివరావు, వెంకటరాజు తల, ముఖం భాగాల్లో తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెం దారు. కారులో ఉన్న మరో ఇద్దరిలో కూనూరు అజయ్కి ఎడమ చెయ్యి విరగగా, జరుపుల రాముకు గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని స్థానికుల సహకారంతో స్థానిక దవాఖానలో చేర్పించారు. అయితే, గాయపడిన ఇద్దరు సీట్ బెల్టులు ధరించగా, మిగతా ముగ్గురు ధరించక పోవడం వల్లే మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా, ఒకే గ్రామానికి చెందిన సౌమ్యులుగా పేరున్న ముగ్గురు కారు ప్రమాదంలో మృత్యువాత పడడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకున్నది. మండలానికి చెందిన అయ్యప్ప స్వా ములు ఇలా ప్రమాదానికి గురి కావడం ఇదే మొదటి సారి. వీరి కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉండగా, ఇక్కడి నుం చి కారులో వెళ్లిన అయ్యప్ప స్వాములే పంచనామా ప్రక్రియ పూర్తి చేయించి, మృతదేహాలను తీసుకొచ్చేందుకు స న్నాహాలు చేస్తున్నారు. కాగా, ప్రమాద సంఘటన దావనంలా వ్యాపించడంతో మండలంలో విషాదం నెలకొంది.
అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన కారు ప్రమాదంలో మూడు కుటుంబాలు తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాయి. 17 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరిస్తున్న సుబ్బయ్యనాయుడుకి భార్య పార్వతి, ఇద్దరు కమార్తెలు హర్షిణి, సార్తిక ఉన్నారు. వీరు బీటెక్ అభ్యసిస్తున్నారు. అలాగే, ఐదేళ్లుగా మాల ధరిస్తు న్న సాంబశివరావుకు భార్య శివకుమా రి, ఇద్దరు కొడుకులు మనీష్, నితీశ్ ఉన్నారు. వీరు చదువుకుంటున్నారు. కాగా, వెంకటరాజు మాల ధరించడం మొదటి సారి కాగా, ఆయనకు భార్య కాత్యాయిని, ముగ్గురు కూతుళ్లున్నారు. వీరికి వివాహలు అయ్యాయి. కొడుకు దుర్గాప్రసాద్ లండన్లో చదువుకుంటున్నాడు. కాగా, అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి సుదూర రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో బాధితుల రోదనలు కలచివేశాయి.