హసన్పర్తి, జనవరి 24: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన కోటం శివశంకర్(30), హనుమకొండ రాంనగర్కు చెందిన చిట్యాల సంపత్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు బుల్లెట్ బైక్పై హనుమకొండ నుంచి హసన్పర్తికి వస్తున్నారు. ఈ క్రమంలో హసన్పర్తి నల్లగుట్ట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటోను రాంగ్ రూట్లో వెళ్లి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ వెనకాల కూర్చున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆటోలో ఉన్న గుండ్ల సింగారానికి చెందిన భూక్యా రజిత(40)కు తీవ్ర గాయాలయ్యా యి. ఆమెను ఎంజీఎం దవఖానకు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందింది. బైక్ నడుపుతున్న సంపత్కు రెండు కాళ్లు విరిగిపోవడంతో ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్న ట్లు సీఐ తెలిపారు. రజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.