నమస్తే నెట్వర్క్ ;ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా రిజల్ట్స్ సాధించి టాప్ లేపాయి. సర్కారు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. హనుమకొండ జిల్లాలో ఫస్టియర్లో 68 శాతం, సెకండియర్లో 73 శాతం, వరంగల్ జిల్లాలో మొదటి సంవత్సరంలో 52 శాతం, రెండో సంవత్సరంలో 59.3 శాతం మంది విదార్థులు పాసయ్యారు. సర్కారు కాలేజీల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంతో వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలకు తీసిపోని విధంగా మార్కులు రావడంతో హర్షం వెలిబుచ్చారు. పేదలకు ఫ్రీగా, ఉత్తమమైన విద్య అందిస్తున్న సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.
హసన్పర్తి కళాశాల
హసన్పర్తి: హసన్పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఎంపీసీలో జే కల్యాణ్రామ్ 982/1000, అభిలాష్ 962, సీఈసీలో ఎండీ.సమీర్ 944, పీ.అక్షయ 934, వీ.చందన 924, టీ.యామిని 834, బీపీసీలో సౌమ్య 935, రమ్యశ్రీ 871 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ ఎంపీసీలో శ్రీవర్ధన్ 459, అనుచరణ్ 456, మయూరి 450, సీఈసీలో స్వర్ణ 394తో సత్తా చాటారు. వరంగల్ జిల్లాలోనే అధిక ఉత్తీర్ణతాశాతాన్ని సాధించారు. రాష్ట్రస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ సునీత, కళాశాల అభివృద్ధి కమిటీ బాధ్యులు చకిలం రాజేశ్వర్రావు, అధ్యాపకులు కుమార్, చాంఫ్లా, కొమురారెడ్డి, సదానందం, రఘురామ్, హరిప్రసాద్, కమలాదేవి, పద్మారాణి, సాయిప్రసాద్, సైదుల సాహెబ్, సుమలత, విజయ్కుమార్ అభినందించారు.
రాయపర్తి కళాశాల
రాయపర్తి: మండల కేంద్రంలోని మల్లెల వెంకటేశ్వర్ రావు స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ జయకుమారి, సివిక్స్ లెక్చరర్ రాజిరెడ్డి వెల్లడించారు. సెకండియర్ ఎంపీసీలో ఎం.అర్చన 845/1000, బైపీసీలో ఎం.సత్య 751/1000, సీఈసీలో బి.కల్పన 815/1000, పీ.శ్రావణి 814/1000 మార్కులు సాధించినట్లు చెప్పారు. ఫస్టియర్ ఎంపీసీలో మహ్మద్ అఖిల్ 406/470, సీహెచ్ శిరీష 402/470, బైపీసీలో మహ్మద్ జావెద్ 273/440, సీఈసీలో బి.రజిత 434/500 మార్కులతో జిల్లాలో ఉత్తమ ఫలితాలను కైవసం చేసుకున్నట్లు వివరించారు.
కోనాయిమాకుల కళాశాల
గీసుగొండ : ఇంటర్ ఫలితాల్లో మండలంలోని కోనాయిమాకుల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని టాప్గా నిలిచింది. కళాశాలలో సెకండియర్ విద్యార్థి బానోత్ రోజా 959/1000 మార్కులు సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్రావు తెలిపారు. కస్తూర్భాగాంధీ, వంచనగిరి ఆదర్శ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయా కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, హిమబిందు తెలిపారు.
సంగెం కళాశాల
సంగెం, మే 9: సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ బీపీసీ విద్యార్థిని ఎనబోతుల కీర్తన 980/1000 సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. 948 మార్కులతో చింతల సింధుశ్రీ ద్వితీయ, 945తో తోట సంధ్య తృతీయ స్థానంలో నిలిచారు. ఎంపీసీ ఫస్టియర్లో తోట సరిత 454/470, నీలం అలేఖ్య 453/470 సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. గవిచర్ల మోడల్స్కూల్లో ఎంపీసీలో గూడ హర్షిత 987 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచినట్టు ప్రిన్సిపాల్ ముజ్బుర్ రెహమాన్ తెలిపారు. 974 మార్కులతో ఎలుకుర్తి సృజన ద్వితీయస్థానంలో, 970 మార్కులతో ఆకుల సాత్విక తృతీయ స్థానంలో నిలిచారని వివరించారు. బీపీసీలో 963 మార్కులు సాధించిన ఇందూరి అంజలి టాపర్గా నిలిచింది. సంగెం కేజీబీవీలో 70శాతం ఉత్తీర్ణత సాధించినట్టు కళాశాల ప్రత్యేకాధికారి నీలిమ తెలిపారు.
కమలాపూర్ కేజీబీవీ..
కమలాపూర్: మండలంలోని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మోడల్ స్కూల్, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటారు. మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండియర్ బైపీసీ విద్యార్థిని ఎం.వర్షిత 986 మార్కులు సాధించింది. కేజీబీవీ విద్యార్థిని చేరాల సిరి సహస్రా ఎంపీసీ 988 మార్కులు సాధించారు. మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ 65శాతం ఉత్తీర్ణత కాగా సెకండియర్లో ఎంపీసీ 911, సీఈసీ నేహాఅంజున్ 932 మార్కులు, మొత్తం 84శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ అనిత వివరించారు. కేజీబీవీలో ఇంటర్ సెకండియర్లో 82శాతం మంది, ఫస్టియర్లో 69శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రత్యేకాధికారి అర్చన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 33శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
కేజీబీవీలు..
నల్లబెల్లి/చెన్నారావుపేట: నల్లబెల్లి కేజీబీవీ సీఈసీ మొదటి సంవత్సరంలో 14 మందికి 9 మంది ఉత్తీర్ణులయ్యారు. శ్రావణి 459/500(సీఈసీ), హేమలత 457/500, సెకండియర్ సీఈసీలో 23మందికి 18 మంది ఉత్తీర్ణత సాధించారు. దీపిక 965/1000, శ్రుతి 942/1000 సాధించారు. ఎంపీహెచ్డబ్ల్యూ సెకండియర్లో 31 మందికి 30 మంది ఉత్తీర్ణత సాధించారు. రాజేశ్వరి 981/1000, వైష్ణవి 971/1000సాధించారు. ఎంపీహెచ్ ఫస్టియర్లో 24 మందికి 20 మంది ఉత్తీర్ణులయ్యారు. జాహ్నవి 484/500, కావ్య 469/500సాధించారు. చెన్నారావుపేట మండలంలోని మోడల్స్కూల్, కేజీబీవీ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపారని ప్రధానోపాధ్యాయులు జ్యోతి, ప్రసన్నలక్ష్మి తెలిపారు. అమీనాబాద్ మోడల్ స్కూల్లో సీనియర్ ఇంటర్లో 68శాతం, జూనియర్ ఇంటర్లో 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మండలకేంద్రంలోని కేజీబీవీలో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రత్యేక అధికారి జ్యోతి తెలిపారు. సీనియర్ ఇంటర్ సీఈసీలో 936 మార్కులతో మమత, జూనియర్ ఇంటర్ సీఈసీలో 438 మార్కులతో లక్ష్మి ప్రతిభ చూపారు.
ఐనవోలు: మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభకనబరించారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో కే వైష్ణవి 923/1000, ఎల్ అను 893/1000, జీ పూజిత 835/ 1000, జే హరిచందన 822/1000, ఎంపీసీ 774/1000, మొదటి సంవత్సరంలో ఎంపీసీలో ఆర్ గీతాశ్రీ 442/470, బైపీసీ ఈ సుష్మిత 369/440, టీ ప్రవళిక 355/440, బీ మౌనిక 346/440 మార్కులు సాధించినట్లు ఎస్వో సునీత తెలిపారు.
సైనిక్ స్కూల్ విద్యార్థులు
ఖానాపురం : అశోక్నగర్ సైనిక్స్కూల్కు చెందిన విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో 75 మందికి 66 మంది, సెకండియర్లో 74 మందికి 70 మంది ఉత్తీర్ణులయ్యారు. బానోత్ సంతోష్కుమార్ 985, దమ్మనగిరి స్నోహిత్ 981, ఫస్టియర్లో కావలి ప్రశాంత్ 464, రామావత్ వినోద్ 464 మార్కులు సాధించారు. అశోక్నగర్లోని కేజీబీవీలో ఎంపీసీలో ఇద్దరికి ఒక్కరు, బైపీసీలో ఆరుగురికి ఇద్దరు ఉత్తీర్ణులయ్యారు. బుధరావుపేట మోడల్స్కూల్కు చెందిన విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 85శాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో బానోత్ రవీందర్ 974/1000 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచాడు. ఫస్టియర్ బైపీసీలో భావన 424 మార్కులు సాధించింది. ఖానాపురం ప్రభుత్వ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 66 శాతం, ద్వితీయ సంవత్సరంలో 62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఎంజేపీ విద్యార్థులకు ర్యాంకులు
కరీమాబాద్: ఉర్సు గుట్ట వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫూలే కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చాయని ప్రిన్సిపాల్ అంజిరెడ్డి తెలిపారు. బైపీసీలో బండి రిషిత 435, నీల తులసి 434, దేవర సాయినిఖిత 431, ముద్రబోయిన వర్షిత 431, నవ్య 429, ఎంపీసీలో అందె మానస 463, నక్క ఆరాధ్య 463, సోమసాని అశ్రిత 463, ముత్తినేని రచన 461 మార్కులు సాధించినట్లు వివరించారు. మరి కొంతమంది విద్యార్థులు 450 పైచిలుకు మార్కులు సాధించారని పేర్కొన్నారు.
నందనం విద్యార్థిని ఫస్ట్
ఐనవోలు: మండలంలోని నందనం గ్రామానికి చెందిన బండి రిశిత ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీలో 435/440 మార్కులు సాధించి, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో ఫస్ట్ వచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ కాలేజీల్లో అన్నింటిల్లో నాలుగో స్థానం సాధించినట్లుగా విద్యార్థి తల్లిదండ్రులు బండి సంతోష్, కృష్ణవేణి తెలిపారు.
పర్వతగిరి ఆర్డీఎఫ్ కళాశాల
పర్వతగిరి: ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రిన్సిపాల్ ఆడెపు జనార్ధన్ తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో బీ.శిరీష 981/1000, పీ.అనూషకు 978/1000, ఆర్.పూజిత 972/1000, బీపీసీలో ఎస్.అస్మిత 976, బీ.స్వాతి 974, సీహెచ్.వైష్ణవి 973, సీఈసీలో ఏ.అఖిల 950, ఎం.త్రివేణి 927, ఆర్.పల్లవి 921 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో సీహెచ్.మనీష్ 448/470, ఎస్.అశ్విత 440, డీ.శ్రీహిత 431, బీపీసీలో పీ.వైష్ణవి 423/440, కే.అక్షయ 403, కే.నవ్య 392, సీఈసీలో టీ.సాయిచరణ్ 476/500, ఎమ్.అక్షయ 425, జే.సంగీత 386 సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్ధన్, వైస్ ప్రిన్సిపాల్ ఏ.రాజు, పీ.యాకాంబ్రం, పీ.రమేశ్, వీ.శ్రీలత, బీ.శ్రీరామమూర్తి, బీ.భిక్షపతి, టీ.సత్యనారాయణ, మహిపాల్రెడ్డి, మహేందర్రెడ్డి, మౌనిక అభినందించారు.
హనుమకొండ జిల్లాలో బాలికలదే పైచేయి
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేయగా జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో 17,626 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 12,013 మంది 68శాతంతో ఉత్తీర్ణత సాధించారు. వారిలో 72శాతంతో బాలికలు నిలిచారు. సెకండియర్లో 14,414 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 10,627 మంది విద్యార్థులు 73శాతంతో ఉత్తీర్ణత సాధించగా వారిలో 79శాతంతో బాలికలు ముందు వరుసలో నిలిచారు. రాష్ట్రంలోనే జిల్లా ఫస్టియర్ ఫలితాల్లో ఆరోస్థానంలో నిలువగా, సెకండియర్ ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఫలితాలతో పోల్చితే ఈసారి సెకండియర్ ఒకేషనల్లోమెరుగైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కోర్సులను కలిపి చూస్తే ఫస్టియర్లో 67.6, సెకండ్ ఇయర్లో 73.7 ఉత్తీర్ణత శాతం సాధించారు. కాగా ప్రభుత్వ కళాశాలలో మంచి మారులు సాధించిన నిరుపేద విద్యార్థులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏ.గోపాల్ అభినందించారు.
కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కేజీబీవీ, ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లాలో ఉన్న 9 కేజీబీవీల నుంచి 396 మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు హాజరుకాగా, 273 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 386 మంది విద్యార్థులు హాజరు కాగా, 311 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆదర్శ పాఠశాలల నుంచి ఫస్టియర్ 271 మంది విద్యార్థులకు 153మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్లో 300 మంది హాజరు కాగా 174 మంది ఉత్తీర్ణత సాధించారు.
వరంగల్ జిల్లాలోనూ..బాలికలు ఫస్టియర్లో 62 శాతం..బాలురు సెకండియర్లో 35శాతం ఉత్తీర్ణత
ఇంటర్ పరీక్షల ఫలితాల్లో వరంగల్ జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్లో (2013/3229) 62శాతం, బాలురు (838/2382) 35శాతం, మొత్తం ఫస్టియర్లో (2851/ 5611) 50శాతంతో ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ఫస్టియర్లో బాలురు (91/345) 26శాతం, బాలికలు (471/656) 71 శాతం, మొత్తం ఫస్టియర్ ఒకేషనల్లో (562/1001) 56 ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్గా ఫస్టియర్లో (3413/ 6612) 52శాతంతో ఉత్తీర్ణతా సాధించారు. సెకండియర్లో బాలికలు (1222/ 1832) 66 శాతం, బాలురు (1108/ 2432) 45శాతం, మొత్తం సెకండియర్లో (3358/ 5729) 58శాతం ఉత్తీర్ణతా సాధించారు. ఒకేషనల్ సెకండియర్లో బాలురు (141/ 296) 47శాతం, బాలికలు (385/ 521) 73శాతం, మొత్తం సెకండియర్ ఒకేషనల్లో (526/817) 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్గా సెకండియర్ జనరల్, ఒకేషనల్ విభాగాల నుంచి (3884/ 6546) 59.3 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు.
కేజీబీవీ విద్యార్థులు
ఫస్టియర్ ఎంపీసీలో వర్ధన్నపేట కేజీబీవీ విద్యార్థిని ఎస్ లోకేశ్వరి 433/470, అదే పాఠశాలకు చెందిన బైపీసీ విద్యార్థిని బీ గౌతమి 393 /440, నల్లబెల్లి కేజీబీవీ సీఈసీలో బీ శ్రావణి 459/500, ఎంపీహెచ్డబ్ల్యూలో గీసుగొండ కేజీబీవీ డీ శిరీష 488/500 మార్కులతో కేజీబీవీల్లో టాపర్గా నిలిచినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. సెకండియర్లో ఎంపీసీలో వర్ధన్నపేట కేజీబీవీ ఏ శిరీష 960/1000, బైపీసీ అదే పాఠశాలకు చెందిన ఎం రీష్మ 961/1000, నల్లబెల్లి కేజీబీవీ సీఈసీలో ఏ దీపిక 965/1000, ఎంపీహెచ్డబ్ల్యూలో నల్లబెల్లి కేజీబీవీ ఎల్ రాజేశ్వరి 981/1000 మార్కులతో జిల్లాలోని కేజీబీవీల్లో టాపర్గా నిలిచినట్లు వివరించారు.