ఎల్కతుర్తి, జనవరి 11: రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల మందను రైలు ఢీకొనడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని దండేపల్లికి చెందిన మాదం భిక్షపతి తన గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు.
ఈ క్రమంలో ట్రాక్ దాటుతుండగా గొర్రెల మందను కాజీపేట నుంచి రామగుండం వైపు వెళ్తున్న ధానాపూర్ (ట్రైన్ నంబర్ 12791) గ్రామ సమీపంలోని 348/21 కిలోమీటర్ వద్ద ఢీకొంది. దీంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మృతిచెందిన విలువ సుమారు రూ.6లక్షల వరకు ఉంటుందని గొర్రెల కాపరి భిక్షపతి తెలిపాడు. కాగా విషయం తెలుసుకున్న ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సై జక్కుల పరమేశ్ చేరుకొని వివరాలు సేకరించారు. రైల్వే అధికారులకు తెలియజేశారు.