గిర్మాజీపేట, ఫిబ్రవరి 8 : జిల్లాలో బుధవారం కంటివెలుగు కార్యక్రమంలో 6,967 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. కంటివెలుగు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 94,000 మంది కి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో చెప్పా రు. బొల్లికొండలో 151 మందికి, బాల్యానాయక్తండాలో 160, ఆకులతండాలో 159, నర్సంపేట వార్డు-23లో 192, ఉప్పరపల్లిలో 160, ఎల్లాయగూడెంలో 119, వరంగల్ వార్డు-26లో 155, వార్డు-35లో 147, వార్డు-21లో 153, వార్డులో 36లో 141, వార్డు-22లో 143, వార్డు-12లో 112, వార్డు-15లో 165, వార్డు-19లో 165, వార్డు-16లో 141, వార్డు-17లో 185, వార్డు-3లో 179, వార్డు-32లో 156, వార్డు-39లో 176, కలెక్టరేట్లో 113, గొల్లపల్లెలో 179, కోనాయిమాకులలో 199, శాయంపేటలో159, బంధంపల్లిలో 149, ఖానాపురంలో 149, మంగళవారిపేటలో 156, నారక్కపేటలో 208, నల్లబెల్లిలో 144, సీతారాంపూర్లో 129, నెక్కొండలో 144, పర్వతగిరిలో 181, చింతనెక్కొండలో 193, శ్రీనగర్లో 110, కొండాపూర్లో 158, కట్య్రాల 153, గన్నారంలో 148, వర్ధన్నపేట వార్డు-4లో 127, రాయపర్తిలో 163, గవిచర్లలో 116, గాంధీనగర్లో 111 మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరూ విధిగా కంటివెలుగు శిబిరాలకు నిర్ణీత సమయానికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని కంటివెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు కోరారు.
సద్వినియోగం చేసుకోవాలి..
కాశీబుగ్గ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి మందులు, అద్దాలు పంపిణీ చేస్తున్నదని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. కాశీబుగ్గలోని స్వశక్తి కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్యశిబిరాన్ని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. అవసరం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాశీబుగ్గ చుట్టు పక్కల వారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు కిరణ్, గుండా రవీందర్, జ్యోతి, శైలజ, ఆశ వర్కర్లు రజిత, కోమల, మోహన్, స్వరూప, మానస, సౌమ్య పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించుకోవాలి..
గీసుగొండ : అందరూ కంటి సమస్యలను పరిష్కరించుకోవాలని సర్పంచ్ డోలి రాధాబాయి తెలిపారు. మండలంలోని కోనాయిమాకుల గ్రామం లో కంటి వెలుగు ప్రోగ్రామ్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యులు అందరికీ పరీక్షలు చేయాలని, ఆవసరం ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేయాలన్నారు. ఆపరేషన్ ఆవసరం ఉన్న వారిని ఎంజీఎం దవాఖానకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.