తొర్రూరు, డిసెంబర్ 26 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మండలంలోని మాటేడు గ్రామంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సర్పంచ్ వల్లపు శోభాయాకయ్య, ఉప సర్పంచ్ పినాకపాణి సహా పెద్దసంఖ్యలో 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, తొర్రూరు గెస్ట్హౌస్లో సోమారపుకుంట తండాకు చెందిన 25కాంగ్రెస్ కుటుంబాలు సర్పంచ్ బానోత్ యాకమ్మాకిషన్నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపు పరుగులు పెడుతున్నారన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వం తీసున్న ప్రతి ఒకరికీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీపై నిరాధార ఆరోపణలు పబ్బం గడుపుతున్నారని అన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితులేంటో గమనిస్తున్నారని, మోసపూరిత వాగ్దానాలు చేసే నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఇప్పటి వరకు దేశంలోనే ఏ సీఎం అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సరారు తెలంగాణకు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని, చివరకు విభజన హామీలను సైతం పక్కనబెట్టి వివక్ష ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. ఐటీఐఆర్, బయ్యారం ఉకు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేసి అన్యాయం చేసిందన్నారు. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు ఉపాధి పథకం కింద కల్లాలు నిర్మించుకుంటే, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం హుకుం జారీ చేయడం సిగ్గుచేటన్నారు. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్న కేంద్రం, రైతులకు మాత్రం మొండిచేయి చూపుతున్నదన్నారు. తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసేందుకే రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నదన్నారు. మండలాధ్యక్షుడు సీతారాములు పాల్గొన్నారు.