కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంచి..
జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం
దుగ్గొండి/గీసుగొండ, జూలై 24: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో శివాజీనగర్లో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. చలపర్తి, జీడికల్, తిమ్మంపేట, మహ్మదాపురం, గిర్నిబావిలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కోమలాభద్రయ్య, నాచినపల్లి, మహ్మదాపురం, మందపల్లి పీఏసీఎస్ చైర్మన్లు రాజేశ్వర్రావు, మహిపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గీసుగొండ మండలం మొగిలిచర్లలో టీఆర్ఎస్ నాయకులు సదానందం, మధుకర్ కేక్కట్ చేసి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో మొక్క లు నాటారు. మనోహర్, వీరేందర్, రవి, అమరేందర్, వెంకటేశ్వర్లు, సూరయ్య. స్వామి, నాగరాజు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
ఖానాపురం/దామెర/ఆత్మకూరు: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం మండలవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. మంగళవారిపేట సొసైటీ కార్యాలయ ఆవరణలో చైర్మన్ రామస్వామినాయక్ ఆధ్వర్యంలో వంద మొక్కలు నాటారు. బుధరావుపేటలో సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో 300, కొత్తూరులో ఎంపీపీ ప్రకాశ్రావు, సర్పంచ్ రమ ఆధ్వర్యంలో 200, అశోక్నగర్, కీర్యతండాలో సర్పంచ్లు కవిత, హఠ్యనాయక్ ఆధ్వర్యంలో 500 మొక్కలు నాటారు. జడ్పీటీసీ స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ఎంపీడీవో సుమనావాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటనర్సయ్య, ఎంపీటీసీ సుభాన్బీ, మౌలానా, సొసైటీ వైస్ చైర్మన్ వేణుకృష్ణ, సర్పంచ్లు రమేశ్నాయక్, సొసైటీ సీఈవో ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. దామెర మండలంలోని ఊరుగొండలో ఎంపీపీ శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్, సంపత్ కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్లు సత్యనారాయణరెడ్డి, అశోక్, గట్ల విష్ణువర్ధన్రెడ్డి, బింగి రాజేందర్, వడ్డెపల్లి శ్రీనివాస్, మేడిపల్లి సాంబయ్య, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, ఉపసర్పంచ్ విద్యాసాగర్, ఎంపీటీసీలు పోలం కృపాకర్రెడ్డి, గండు రాము, ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ సుదర్శన్, మధుకర్, సాంబయ్య, కుమారస్వామి పాల్గొన్నారు. ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ముక్కోటి వృక్షార్చనలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ రాధిక, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి, సర్పంచ్లు యాదగిరి, రబీయాబీ హుస్సేన్, పర్వతగిరి రాజు, ఎంపీడీవో నర్మద, ఏపీవో రాజిరెడ్డి, ఎంపీవో ప్రభాకర్ పాల్గొన్నారు.
రాయపర్తి: మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో విద్యార్థినులకు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ స్మరత్ చంద్ర, ఏఈలు అనూష, శివప్రసాద్, పూస మధు, సర్పంచ్లు గారె నర్సయ్య, సరితారవీందర్రెడ్డి, చిన్నాల తారాశ్రీ రాజబాబు, రెంటాల గోవర్ధన్రెడ్డి, సారయ్య, ఎల్లయ్య, సుమతీయాదవరెడ్డి, కిషన్నాయక్ పాల్గొన్నారు.