నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 17: పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ నిరుపేదలకు 24 గంటలపాటు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ముగ్దుంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా 59 పల్లె దవాఖానలు మంజూరు కాగా, ఇప్పటికే 22 నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు తెపారు. మిగతా దవాఖానలను అతిత్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పల్లె దవాఖానను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, సర్పంచ్ పెండ్యాల జ్యోతి, ఎంపీటీసీ చీకటి స్వరూప, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రకాశ్, చెన్నారావుపేట పీహెచ్సీ వైద్యాధికారి సరోజ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, పెండ్యాల సదానందం, పెండ్యాల ప్రభాకర్ పాల్గొన్నారు.
ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది
నర్సంపేట/నర్సంపేటరూరల్/ఖానాపురం: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని శుక్రవారం పెద్ది ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం ఉపాధ్యక్షుడు గద్దల రాజు, సహాయ కార్యదర్శి రామకృష్ణ, ఆనంద్, శ్రీధర్, వంశీ, సత్యనారాయణ, శ్యామ్సుందర్, ఆస్గర్, సంజీవరావు, రాజేశ్వరి పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట అంబేద్కర్నగర్లోని గుడిసెవాసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానికులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కల్లెపెల్లి ప్రణయదీప్, రవి, రమేశ్, యాకోబు, రాజు, సుధాకర్, రజిత, సుమలత పాల్గొన్నారు.
నర్సంపేట మండలంలోని ముత్యాలమ్మతండాలో సీసీరోడ్లు మంజూరు చేయాలని సర్పంచ్ భూక్యా సైద కోరారు. ఈ మేరకు పట్టణంలో ఎమ్మెల్యే పెద్దిని కలిసి వినతిపత్రం అందించారు. వార్డు సభ్యులు, నాయకులు ధంజ్యా, ఈర్య, పంతులు, రంజీ, తిరుపతి, రమేశ్, సురేశ్, రాజు పాల్గొన్నారు. అంతేకాకుండా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులోకి గోదావరి జలాలను తీసుకొచ్చిన సందర్భంగా ధర్మారావుపేటకు చెందిన రైతులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, ఆరెల్లి రాంచంద్రయ్య, కందకట్ల భిక్షపతి, కేశపు శంకరయ్య, సంపత్, తాళ్ల సంతోష్ పాల్గొన్నారు.