మంచాల, జులై 9 : సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం మండలంలోని తాళ్లపల్లిగూడ, ఆరుట్ల, మంచాల, ఆగపల్లి, కాగజ్ఘట్, రంగాపూర్ తదితర గ్రామాల్లో శ్మశాన వాటిక, ప్రధాన రోడ్ల వెంబడి, పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్లు జంగయ్య యాదవ్, కొంగరవిష్ణు వర్ధన్రెడ్డి, జగన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మమత, అండాలు, ఎంపీటీసీలు రమేశ్, శ్రీనివాస్, సుకన్య శేఖర్రెడ్డితో పాటు ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోఆర్డీ మధుసూదనాచారి, ఏఈ అబ్బాస్తో పాటు కార్యదర్శులు పాల్గొన్నారు.
పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి
తలకొండపల్లి, జూలై 9 : పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీవో రాఘవులు అన్నారు. మండలంలోని జంగారెడ్డిపల్లి, తలకొండపల్లి, హర్యతండా, జూలపల్లి, వెంకటూపూర్ గ్రామాల్లో పనులు పరిశీలించారు.
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
కడ్తాల్, జూలై 9 : గ్రామాలు, తండాల్లో మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్పీటీసీ దశరథ్నాయక్, కడ్తాల్ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు, బోయిన్గుట్ట తండాలో నిర్వహించిన పల్లె ప్రగతిలో ఎంపీడీవో రామకృష్ణ, ప్రత్యేకాధికారి ధాత్రిదేవితో కలిసి ఆయన పర్యటించారు. మండల కేంద్రంలోని రైత వేదిక వద్ద సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, రాములుగౌడ్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, నరేశ్, వ్యవసాయశాఖ ఏవో శ్రీలత, ఎంపీవో తేజ్సింగ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 9 : మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని ముకునూరు గ్రామంలో శుక్రవారం పల్లెప్రగతిలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిరాజు, ఎంపీటీసీ జ్యోతి, ఎంపీడీవో మహేశ్బాబు, స్పెషల్ ఆఫీసర్ రమాదేవి, టీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు జగదీశ్వర్, ప్రిన్సిపాల్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల్లో పెద్దపీట
ఇబ్రహీంపట్నం, జులై 9 : మొక్కలను విధిగా పెంచిన వారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి అన్నారు. మున్సిపాలిటీలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. మున్సిపాలిటీలో ఆరువేల ఇండ్లు ఉన్నాయని ఒక్కో ఇంటికి ఆరు మొక్కల చొప్పున 60వేల మొక్కలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లెప్రగతి
యాచారం, జూలై 9 : మొండిగౌరెల్లిలో మండల ప్రత్యేకాధికారి జంగారెడ్డి, ఎంపీడీవో మమతాబాయి పర్యటించారు. పల్లెప్రగతి పనితీరును సర్పంచ్ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీవో లింగయ్య, ఏపీఎం సతీష్, అధికారులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
హైస్కూల్లో హరితహారం
పెద్దఅంబర్పేట, జూలై 9 : నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చూడాలని 22వ వార్డు కౌన్సిలర్ హరిశంకర్, కుంట్లూర్ మాజీ సర్పంచ్ ప్రభాకర్రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా కుంట్లూర్ హైస్కూల్లో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బలరాం, నేతలు రాము, వెంకటేశ్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్లో..
అబ్దుల్లాపూర్మెట్, జూలై 9 : పల్లె ప్రగతిలో అబ్దుల్లాపూర్మెట్, బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో ఎంపీపీ రేఖామహేందర్గౌడ్, జడ్పీటీసీ దాస్గౌడ్, జిల్లా అధికారి పద్మావతి, ప్రత్యేక అధికారి రాజేశ్వర్రెడ్డితో కలిసి పర్యటించి పల్లె ప్రకృతి వనం, నర్సరీని పర్యవేక్షించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్రెడ్డి, ఎంఈవో హీర్యానాయక్, సర్పంచ్ కిరణ్కుమార్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, సురకంటి వనజశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు అనిత, సౌమ్య పాల్గొన్నారు.