జనగామ చౌరస్తా, జనవరి 5 : పోక్సో కేసులో ఓ వ్యక్తికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జనగామ మండలంలోని చీటకోడూరుకు చెందిన వడ్లకొండ ప్రసాద్ అలియాస్ బొట్ల ప్రసాద్ 2019లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు శుక్రవారం జిల్లా కోర్టులో నేరం రుజువైంది. దీంతో అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.80వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీ రవీంద్రశర్మ తీర్పునిచ్చినట్లు అర్బన్ సీఐ ఎలబోయిన శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు స్పెషల్ పీపీగా ఎం స్టీవెన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా పూర్వపు ఏసీపీ వినోద్కుమార్, ప్రస్తుత అర్బన్ సీఐ శ్రీనివాస్ వ్యవహరించారు. కోర్టు లైజన్ ఆఫీసర్గా ఏఎస్సై పీ సారంగపాణి, పీసీలు బీ రమేశ్, ఎస్ తిరుపతి పాల్గొన్నారు.