2,864 రహదారులు
నిడివి 3,97,747 కిలోమీటర్లు
రూరల్ జిల్లాలో దళితవాడలపై సర్వేపూర్తి
సర్కారుకు అధికారుల నివేదిక
వరంగల్రూరల్, జూలై 12(నమస్తేతెలంగాణ): దళిత సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం పల్లె ప్రగతిలో భాగంగా దళితవాడల్లో మౌలిక వసతులపై సమగ్ర సర్వే చేయించింది. వరంగల్ రూరల్ జిల్లాలో 259 గ్రామ పంచాయతీల పరిధిలోని 384 ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. దళితవాడల్లో ఉన్న వసతులతో పాటు ఎక్కడెక్కడ తాగునీరు, విద్యుత్, వీధిదీపాలు, కరంటు స్తంభాలు, డ్రైన్లు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల అవసరం ఉన్నదో సర్కారుకు నివేదించారు. దీని ఆధారంగా ప్రభుత్వ ఆమోదంతో దళితవాడల్లో వసతులు కల్పించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు జిల్లాలోని దళిత వాడల్లో పౌర మౌ లిక వసతులపై చేపట్టిన సర్వే పూర్తయింది. 259 గ్రామపంచాయతీల పరిధిలోని 384 ప్రాంతాల్లో దళితుల ఇండ్లు 27, 642 ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో 2,864 బీటీ, సీసీ, మెటల్, కచ్చా రోడ్లు ఉన్నాయని, వీటి నిడివి 3,97,747 కి.మీ ఉందని ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపా రు. నాల్గో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో దళిత సాధికా రత కోసం ప్రత్యేకంగా దళితవాడల్లో పౌర మౌలిక వస తుల పై సమగ్ర సర్వే జరపాలని ప్రభుత్వం అధికారులను ఆదే శించింది. దీంతో ఈ నెల ఒకటి నుంచి పది వరకు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు సర్వే జరిపారు. ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దళితవాడలు, అందులో ఉన్న ఇండ్లు, కుటుంబాలు, మొత్తం రోడ్లు, వాటి లో బీటీ, సీసీ, మెటల్, కచ్చా రోడ్లు, రోడ్డు సౌకర్యం లేని ఇండ్లు, ఎన్ని మీటర్ల రోడ్డు వేయాల్సి ఉంది?, డ్రెయిన్లు, ఇంకుడుగుంతలు ఉన్న, లేని కుటుంబాలు, ఎన్ని మీటర్లు డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంది, తాగునీటి, విద్యుత్ సౌకర్యం, వీధిలైట్లు, శిథిలమైన స్తంభాలు, అదనంగా కావాల్సిన స్తంభాలు, గృహావసర విద్యుత్ కనెక్షన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇతర అదనపు మౌలిక వసతులపై వివరాలు సేకరించారు. ప్రభు త్వం అందజేసిన ఫార్మాట్లో వీటిని నమోదు చేసి నివేదిక రూపంలో పంపారు.
నెక్కొండలో ఎక్కువ
సర్వే నివేదిక ప్రకారం దళితవాడలు గల ప్రాంతాలు జిల్లా లోని 16 మండలాల్లో నెక్కొండ మండలంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 23 గ్రామపంచాయతీల పరిధిలో 35 ప్రాంతాల్లో దళిత వాడలు ఉన్నాయి. 25 జీపీల పరిధిలో 34 ప్రాంతాలతో దుగ్గొండి మండలం రెండోస్థానంలో ఉంది. సంగెం, నల్లబెల్లి మండలాల్లో 32, నర్సంపేటలో 30, రా యపర్తిలో 28, పర్వతగిరిలో 25, చెన్నారావుపేటలో 24, శాయంపేటలో 22, ఆత్మకూరులో 21 ఉన్నాయి. వర్ధన్నపే టలో 19, దామెరలో 19, గీసుగొండలో 18, ఖానాపురం లో 18, నడికూడలో 17, పరకాలలో 10 ప్రాంతాల్లో దళిత వాడలు ఉన్నట్లు అధికారులు నివేదికలో తెలిపారు. ఇందు లో 27,642 ఇండ్లు ఉంటే, వీటిలో ఎక్కువగా సంగెం మండలంలో 2,358 ఇండ్లు ఉన్నాయి. ఆ తర్వాత మండలం వారీగా శాయంపేటలో 2,259, రాయపర్తిలో 2,193, వర్ధన్న పేటలో 2,191, ఆత్మకూరులో 2,068, నెక్కొండలో 2,012 ఇండ్లు ఉన్నాయి. దుగ్గొండిలో 1,954, నడికూడలో 1,939, గీసుగొండలో 1,753, దామెరలో 1,624, పర్వ తగిరిలో 1,613, నర్సంపేటలో 1,365, పరకాలలో 1,186, చెన్నారావుపేటలో 1,173, ఖానాపురంలో 857 ఇండ్లు ఉన్నట్లు అధికారులు సర్వేలో గుర్తించారు.
రహదారులు ఇవే
దళితవాడల్లో మొత్తం 2,864 రహదారులు ఉంటే వీటి లో 108 బీటీ రోడ్లు 26,720 కి.మీ, 1,635 సీసీ రోడ్లు 2,28,842 కి.మీ, 157 మెటల్ రోడ్లు 22,735 కి.మీ, 981 కచ్చా రోడ్లు 1,23,307 కి.మీ ఉన్నాయి. రహదారి వసతి లేని ఇండ్లు 2,162 ఉన్నాయని, 70,214 కి.మీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని అధికారులు నివేదికలో తెలిపా రు. రహదారుల మాదిరిగానే దళిత వాడలు ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వీధి దీపాలు, కరంటు స్తంభాలు, డ్రెయిన్లు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల వివ రాలను, ఇక్కడ చేపట్టాల్సిన మౌలిక వసతులనూ నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక రూపొం దించి అమల్లో పెట్టే అవకాశం ఉంది.