పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కమలాపూర్, జూలై 11 : అన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం కమలాపూర్లో జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధికి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధికి తేడా గమనించాలన్నారు. ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపాలని కోరారు. అధికార పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఆర్యవైశ్యులు వెల్లడించారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి పెరియాల రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ పెండ్యాల రవీందర్రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, నాయకులు కట్కూరి తిరుపతిరెడ్డి, నవీన్కుమార్, నర్సింహారెడ్డి, మౌటం అశోక్, మెండు రమేశ్, మల్లారెడ్డి, వైశ్య సంఘం అధ్యక్షుడు మునింధర్, గౌరవ అధ్యక్షుడు సంపత్కుమార్, నాయకులు పున్నంచందర్, శివకుమార్, వీరభద్రయ్య, విజయ్కుమార్, కార్తీక్, సాగర్బాబు, ప్రసాద్, శివశంకర్, సాంబమూర్తి, యుగేంధర్, రాజేందర్, శ్రీనివాస్, భిక్షపతి, ఉపేందర్, కృష్ణమూర్తి, రమేశ్, ప్రవీణ్, సతీశ్, రఘురాం, సాంబశివుడు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, మండలంలోని కానిపర్తి గ్రామానికి చెందిన కర్నానే గొల్ల సంఘం అధ్యక్షుడు సందెల కుమారస్వామి ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిశారు. కుల సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కుల సంఘం భవనంతోపాటు గ్రామంలో హైమాస్ వీధిలైట్లు మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.