పదో తరగతి పరీక్షలు ముగిశాయి. సెలవులు కూడా రావడంతో విద్యార్థులు తమ ఊళ్లకు పయనమయ్యారు. శనివారం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో హనుమకొండ బస్స్టేషన్ కిక్కిరిసింది.
కానీ ప్రధాన రూట్లలో సరిపడా బస్సుల్లేక గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఓ వైపు భానుడి భగభగలు.. మరో వైపు బస్సులు కానరాక నానా అగచాట్లు పడ్డారు.